Newsఆ విషయం తలుచుకుని .. స్టేజీ పైనే గుక్క పట్టి...

ఆ విషయం తలుచుకుని .. స్టేజీ పైనే గుక్క పట్టి ఏడ్చేసిన విష్ణు ప్రియ.. ఇంత బాధను అనుభవిస్తుందా(Video)..!!

మన లైఫ్ లో అమ్మ ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో మనందరికీ బాగా తెలిసిందే. ఎన్నో నొప్పులు భరించి.. తన లైఫ్ని సాక్రిఫైజ్ చేసి మరి మనకు కొత్త లైఫ్ ఇస్తుంది . అలాంటి అమ్మ మన లైఫ్ లో లేకపోతే ఆ బాధ వర్ణాతితం . అలాంటి ఓ బాధను అనుభవిస్తుంది యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు ప్రియ. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దూసుకుపోతున్న విష్ణు ప్రియ అమ్మగారు రీసెంట్ గానే అనారోగ్య కారణంగా మరణించారు .

ఆ టైంలో విష్ణు కనీరు మున్నీరుగా విలపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. అమ్మ పై తనకు ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది . కాగా రీసెంట్ గా మదర్స్ డే సందర్భంగా ఈటీవీలో ” ప్రియమైన అమ్మకు” అనే పేరుతో స్పెషల్ ఎపిసోడ్ ని ప్డిజైన్ చేసారు మేకర్స్. ఈ ఈవెంట్ కి జబర్ధస్త్ కమెడీయన్స్ అంతా పేరెంట్స్ తో వచ్చారు .

అంతేకాదు తల్లిదండ్రులు మన లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అనే విషయం పై పలు స్కిట్స్ వేసి చూపించారు . ఈ క్రమంలోనే తన ఇద్దరు కొడుకులు అమ్మ ఆరోగ్యం నిర్లక్ష్యం చేయడం తో కారణంగా మరణిస్తుంది. ఆ స్కిట్ చూసిన విష్ణుప్రియ గుక్క పట్టి ఏడుస్తూ .. “నేను నిన్ను మిస్ అవుతున్నాను అమ్మ” అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేసింది . విష్ణు ప్రియా ను చూసిన వారంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాదు స్టేజీ పై తనకు అమ్మ ఎంత స్పెషల్లో చెప్పుకొచ్చింది. ” ఐ లవ్ యు ..ఐ యాం సారీ అమ్మ “అంటూ విష్ణు ప్రియ బోరున ఏడ్చేసింది. దీంతో విష్ణు అమ్మగారిని ఎంత మిస్ అవుతుందో అంటూ ఫాన్స్ సైతం ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news