Moviesసావిత్రి ఒట్టేయించుకుని మ‌రీ చెప్పినా... శ్రీదేవి చేసిన పెద్ద త‌ప్పు ఇదే...!

సావిత్రి ఒట్టేయించుకుని మ‌రీ చెప్పినా… శ్రీదేవి చేసిన పెద్ద త‌ప్పు ఇదే…!

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి ఐదేళ్లు దాటుతున్న కూడా ఇప్పటికీ ఆమె ప్రతిరోజు వార్తల్లో ఉంటూనే వస్తోంది. శ్రీదేవి క్రేజ్, చరిష్మా అలాంటిది. శ్రీదేవి తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది.
చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు చూసి స్టార్ హీరోయిన్ అయింది. ఆమె చిన్నప్పటినుంచి అమ్మ కూచి.. మొత్తం తన తల్లి కనుసన్నలోనే ఆమె పెరిగింది చివరకు ఆమె హీరోయిన్ అయ్యాక రెమ్యూనరేషన్ తో పాటు ఆమె ఆర్థిక వ్యవహారాలు.. ఆస్తులు కొనుగోలు అన్నీ కూడా తల్లి చూసుకునేవారు.

అయితే జీవితం చివరి దశలో మాత్రం ఆమె తల్లి మాట కాదని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోనికపూర్‌ను వివాహం చేసుకున్నారు. ఇక మహానటి సావిత్రికి శ్రీదేవి అంటే ఎంతో ఇష్టం. అలాగే శ్రీదేవి కూడా సావిత్రిని ఎంతో అభిమానించేవారు. సావిత్రమ్మ అయితే శ్రీదేవిని తన కూతురు అని ఎంతో అపురూపంగా చూసుకునే వారట. సావిత్రి తన జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిందో… అప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న జెమినీ గణేష్ కు నాలుగో భార్య‌గా వెళ్లి పతనం అయిపోయింది.

తాను ఎలాంటి తప్పు అయితే చేశానో.. ఆ తప్పు శ్రీదేవి చేయకూడదని.. సావిత్రి శ్రీదేవి చేయిని తన చేతిలో వేసుకుని ఆమె దగ్గర ఒక మాట తీసుకున్నారు. జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా రెండో పెళ్లి వ్యక్తిని భర్తగా స్వీకరించవద్దు.. దయచేసి ఈ ఒక్క మాట విను అని చెప్పారట. సావిత్రమ్మ ఒట్టేసి మరి మాట తీసుకున్న శ్రీదేవి ఆ మాట నెరవేర్చలేక పోయింది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న బోని కపూర్ వలలో పడిపోయింది.

సావిత్రి స్టార్ హీరోయిన్ అయ్యాక ఎలాంటి తప్పులు చేసి పతనం అయిపోయిందో.. శ్రీదేవి కూడా దాదాపు అదే తప్పులు చేస్తూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. ఇంకా ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న శ్రీదేవి కూడా అర్ధాంతరంగా తనువు చాలించింది. ఎంత విచిత్రం అంటే సావిత్రమ్మ తాను చేసిన తప్పు శ్రీదేవి చేయకూడదని ఎన్ని జాగ్రత్తలు చెప్పినా… శ్రీదేవి మాత్రం అదే తప్పుచేసి బలైపోయింది విధి విచిత్రం అంటే ఇదేనేమో..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news