Moviesమ‌హేష్ - త్రివిక్ర‌మ్ సినిమాలో లేడీ కానిస్టేబుల్‌గా క్రేజీ హీరోయిన్‌…!

మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమాలో లేడీ కానిస్టేబుల్‌గా క్రేజీ హీరోయిన్‌…!


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో ప్లాన్ చేస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన అత‌డు, ఖ‌లేజా సినిమాల‌ను మించి ఉండేలా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. అత‌డు, ఖ‌లేజా క‌మ‌ర్షియ‌ల్‌గా అనుకున్న రేంజ్‌లో స‌క్సెస్ కాలేదు. పైగా వీరిద్ద‌రి కాంబోలో చివ‌ర‌గా వ‌చ్చిన ఖ‌లేజా 2010లో రిలీజ్ అయ్యింది. అంటే మ‌ళ్లీ 12 ఏళ్ల త‌ర్వాత వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతోంది.

ఈ సారి మ‌హేష్‌కు ఇండ‌స్ట్రీ హిట్ కాదు పాన్ ఇండియా రేంజ్ హిట్ ఇవ్వాల‌ని త్రివిక్ర‌మ్ క‌సితో వ‌ర్క్ చేస్తున్నాడు. పైగా అల వైకుంఠ‌పురంలో త‌ర్వాత త్రివిక్ర‌మ్ ఏ సినిమా చేయ‌లేదు. అందుకే ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాల‌తో పాటు కాస్టింగ్ ఎంపిక కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉంటోంది. పూజా హెగ్డేను మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇక యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని అంటున్నారు.

ఇప్పుడు ఈ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో పాటు మ‌రో ముద్దుగుమ్మ‌ను కూడా త్రివిక్ర‌మ్ ఫిక్స్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఆ ముద్దుగుమ్మ ఎవ‌రో కాదు బాలీవుడ్ భామ భూమి ప‌డ్నేక‌ర్‌. సినిమాలో సెకండాఫ్‌లో వ‌చ్చే ఓ కీల‌క పాత్ర కోసం ఆమెను తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఇందులో భూమి లేడీ కానిస్టేబుల్‌గా న‌టించ‌బోతోంద‌ట‌. ఈ పాత్ర సినిమాలో కీల‌కంగా ఉంటుంద‌ని అంటున్నారు.

భూమి ప‌డ్నేక‌ర్‌ను తీసుకోవ‌డం బాలీవుడ్‌లోనూ సినిమాకు మంచి బ‌జ్ వ‌చ్చేందుకు హెల్ఫ్ అవుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఏదేమైనా త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు సంబంధించి న‌టీన‌టుల‌ను ఎంపిక చేయ‌డం అయితే మామూలు ఆస‌క్తిగా లేదు. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news