Moviesఆ మాట‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న ఛార్మీ... లైట్ తీస్కోమ‌న్న పూరి... ఏం...

ఆ మాట‌ల‌కు క‌న్నీళ్లు పెట్టుకున్న ఛార్మీ… లైట్ తీస్కోమ‌న్న పూరి… ఏం జ‌రిగింది…!

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందే లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 22 సంవత్సరాల క్రితం వచ్చిన బద్రి సినిమాతో పూరి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన ఘనత పూరికే దక్కుతుంది. పెద్ద కథ ఉండదు.. అలాగని భారీ బడ్జెట్ ఉండదు. స్టార్ కాస్టింగ్ అవసరం లేదు.. అయినా పూరి సూపర్ డూపర్ హిట్లు కొట్టి చూపిస్తూ ఉంటారు. చాలామంది స్టార్ హీరోలు పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేస్తే చాలు తమకు తిరుగలేని… మాస్ ఇమేజ్‌ వస్తుందని ఎన్నో ఆశలతో ఉండేవారు.

నిజంగా పూరి మనసుపెట్టి పనిచేస్తే సినిమా హిట్ అవుతుంది. అయితే గత కొన్ని సంవ‌త్స‌రాలుగా పూరి నుంచి వరుసగా ప్లాప్ సినిమాలు వస్తున్నాయి. ఎక్కడో బ్యాంకాక్‌ వెళ్లి లేదా గోవాలో కూర్చుని ఐదారు రోజుల్లో కథ రాసేయటం… రెండు మూడు నెలల్లో సినిమా చుట్టేయటం జరుగుతుంది. ప్రేక్షకుల నాడి తెలిసిన కూడా పూరి ఎందుకో ఒక మూస ఫార్మాట్లో సినిమాలు తెరకెక్కిస్తూ వరుసగా పరాజ‌యాలు మూటగట్టుకుంటున్నాడు.

వ‌రుస ప్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో పూరి ట్రాక్‌ ఎక్కాడు. ఆ వెంటనే విజయ్ దేవరకొండ తో ఏకంగా లైగర్ లాంటి పాన్ ఇండియా రేంజ్ లో హడావుడి చేస్తే పెద్ద డిజాస్టర్ అయింది. ఆ సినిమాతో పూరి పరువు మొత్తం పోయింది. పూరి వరుస ప్లాపుల‌కు కారణం హీరోయిన్ ఛార్మితో ఆయన నడిపిస్తున్న ఎఫైర్ అన్న రూమర్లు ఎప్పటినుంచో ఉన్నాయి. తనపై ఎన్ని విమర్శలు వస్తున్నా పూరి మాత్రం ఛార్మితో కలిసి నడుస్తూ… ఛార్మీని నిర్మాతగా పెడుతూ తన సినిమాలలో ఆమెను నిర్మాణ భాగస్వామిగా చేస్తూనే వస్తున్నాడు.

అయితే పూరికి, ఆయ‌న భార్య లావ‌ణ్య‌కు ఇండ‌స్ట్రీలోనే కొంద‌రు పెళ్లి చేశారు. హేమ‌, యాంక‌ర్ ఝాన్సీతో పాటు ఇప్పుడు ఆర్టిస్టులుగా కొన‌సాగుతోన్న కొంద‌రు పూరి దూర‌ద‌ర్శ‌న్ సీరియ‌ల్స్‌ను డైరెక్ట్ చేస్తోన్న‌ప్పుడే లావ‌ణ్య‌తో ప్రేమ‌లో ప‌డ‌డంతో పాటు వెంట‌నే పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు పూరీ జీరో. హేమ‌, ఝాన్సీ లాంటి వాళ్లే ఆ పెళ్లికి త‌లో చేయి వేశార‌ని అంటారు.

అయితే ఛార్మీతో బంధం విష‌యంలో మాత్రం పూరి ఓ మాయ‌లో ప‌డిపోయాడ‌ని.. ఆ ముసుగు ఎప్ప‌ట‌కీ అయినా తొల‌గుతుంద‌ని.. పూరి స‌న్నిహితులు, ఆయ‌న శ్రేయ‌స్సు కోరుకునే వారు ప‌రోక్షంగా ఛార్మీని ఉద్దేశించి విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. అలాగే బండ్ల గ‌ణేష్ కూడా పూరి కొడుకు ఛోర్‌బ‌జార్ ఆడియో ఫంక్ష‌న్‌కు వ‌చ్చి పూరి – ఛార్మీ బంధం నేప‌థ్యంలోనే పూరిని టార్గెట్ చేసిన‌ట్టుగా సెటైర్లు వేశాడు.

ఆ త‌ర్వాత పూరి కూడా బండ్ల‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డం జ‌రిగినా.. ఇలా అంద‌రూ త‌న‌నే టార్గెట్ చేస్తూ మాట్లాడ‌డంతో ఛార్మీ బాగా హ‌ర్ట్ అవ్వ‌డంతో పాటు కొన్నాళ్లు పూరి ద‌గ్గ‌ర‌కు రాక‌పోవ‌డం.. బాధ‌ప‌డడం జ‌రిగింద‌ట‌. అయితే పూరి మాత్రం ఇవ‌న్నీ లైట్ తీస్కోమ‌ని చెప్పిన త‌ర్వాత మ‌ళ్లీ పూరి ద‌గ్గ‌ర‌కు వ‌స్తోంద‌ని ఇండ‌స్ట్రీ వాళ్లు అంటున్నారు. అయితే పూరి కూడా త‌న‌పై ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా త‌న జీవితంపై ఆయ‌న‌కు ఓ క్లారిటీ ఉండ‌డంతో అదే రూట్లో వెళుతున్నార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news