Moviesఆమె ఫేస్ కి అంత సీన్ లేదు.. రష్మిక ను దారుణంగా...

ఆమె ఫేస్ కి అంత సీన్ లేదు.. రష్మిక ను దారుణంగా అవమానించిన కాంతారా డైరెక్టర్.. !!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటి సంపాదించుకున్న రష్మిక మందన క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్ తో రష్మిక మందన సోషల్ మీడియా లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉంటుంది . రష్మిక మందన ప్రజెంట్ కాంతారా డైరెక్టర్ రిషిబ్ శెట్టితో ఉన్న వివాదం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. కాగా కొన్ని రోజులుగా వీళ్ళ మధ్య ఉన్న గొడవలు అఫీషియల్ గానే బయటపెడుతూ వచ్చారు ఇద్దరు స్టార్ సెలబ్రెటీస్.

కాగా రష్మిక మందన ఎటకేలకు స్పందిస్తూ..” మీడియాకు మేము ఏం మాట్లాడుకున్నామో తెలియదని.. నేను కాంతారా డైరెక్టర్ తో మాట్లాడాలని ..సినిమా చూసానని.. సినిమా యూనిట్ పాజిటివ్గా స్పందించిందని చెప్పుకొచ్చింది”. అయితే రీసెంట్గా కాంతారా డైరెక్టర్ చేసిన బిహేవియర్ పరోక్షంగా రష్మిక మందన పరువు తీసిన్నట్లైంది. రష్మిక మందన కిర్రాక్ పార్టీ ద్వారా ఇండస్ట్రీలో కి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు సంవత్సరాల సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు .

“మా సినిమా విడుదలై ఆరు సంవత్సరాలు అయినప్పటికీ ..మాకోసం మీరు చేసిన సందడి థియేటర్స్ లో వేసిన విజిల్స్ .. ఇప్పటికి నాకు గుర్తుంది.. మిమ్మల్ని మరోసారి ఆ రోజుల్లోకి తీసుకెళ్తాను ..ఈ వేడుకలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ” అంటూ రిషిబ్ శెట్టి హీరో రక్షిత్ శెట్టిని ..నిర్మాణ సంస్థ పేరుని అలాగే మ్యూజిక్ డైరెక్టర్.. లోకనాధ్ ని ట్యాగ్ చేశారు. అంత పెద్ద హీరోయిన్ రష్మిక ముందన్నా పేరు ను ట్యాగ్ చేయలేదు . ఈ క్రమంలోనే మరోసారి రష్మిక – రిషబ్ శెట్టి పేర్లు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. రిషబ్ కావాలని ఆమె పేరుని ట్యాగ్ చేయలేదని ..వాళ్ళు మధ్య ఇంకా గొడవలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news