Moviesబ్రేకింగ్: ఆ ఒక్క మాట తో..లైవ్ లోనే ఏడ్చేసిన సమంత..!!

బ్రేకింగ్: ఆ ఒక్క మాట తో..లైవ్ లోనే ఏడ్చేసిన సమంత..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. రీసెంట్ గా నటించిన సినిమా “శాకుంతలం”. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నింది. రీసెంట్ గా కొద్ది సేప్పటి క్రితమే ట్రైలర్ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే అక్కడ స్టేజీ పై మాట్లాడుతూ.. డైరెక్టర్ గుణ శేఖర్ ఎమోషనల్ అయ్యారు.

అక్కడ ఉన్నవారు ఎంత చెప్తున్నా కానీ కంట్రోల్ చేసుకోలేనంతగా కన్నీరు పెట్టుకున్నారు . ఇదే క్రమంలో గుణశేఖర్ మాట్లాడిన మాటలకు సమంత కూడా ఎమోషనల్ అయిపోయింది . లైవ్ జరుగుతుంది అని తెలిసినా కూడా లైవ్ సమంత తన ఏడుపును కంట్రోల్ చేసుకోలేకపోయింది. అందరి ముందే ఏడవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఈ సినిమాతో అంత అటాచ్మెంట్ ఉందని ..ఈ సినిమాని ఎంతో కష్టపడి తెరకెక్కించామని గుణశేఖర్ చెప్పుకొచ్చారు . ట్రైలర్లో సమంత తన నటనను మరోసారి ప్రూవ్ చేసుకుంది . మరీ ముఖ్యంగా సినిమాలోని ఒక్కొక్క డైలాగ్ చాలా అద్భుతంగా అద్భుతంగా ఉన్నట్లు జనాలనుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది . భూమి మీద అమ్మా నాన్నలకి అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకి గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది అనే సన్నివేశాలతో ట్రైలర్ ప్రారంభం ఐంది.

ఆమె పడే కష్టాలు భూమాతకు సైతం భారమే, కర్మకి ఎవరూ అతీతులు కారు అంటూ వినిపించే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఓవరాల్ గా సమంత ఎమోషనల్ పెర్ఫామెన్స్, అద్భుతమైన గ్లామర్ లుక్ ఈ ట్రైలర్ లో చూడొచ్చు. ఫిబ్రవరి 17న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోని సమంత ఇలా ఎమోషనల్ గా లైవ్ లోనే ఏడ్చేసిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news