Moviesఫ్యాన్స్‌తో క‌లిసి సినిమా చూస్తూ ఆ థియేట‌ర్లో బాల‌య్య ర‌చ్చ‌...!

ఫ్యాన్స్‌తో క‌లిసి సినిమా చూస్తూ ఆ థియేట‌ర్లో బాల‌య్య ర‌చ్చ‌…!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెర‌కెక్కించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ వీర‌సింహారెడ్డి. బాల‌య్య నుంచి అఖండ లాంటి భారీ హిట్ త‌ర్వాత వ‌చ్చిన సినిమాపై మామూలు అంచ‌నాలు లేవు. సినిమాపై ముందు నుంచే భారీ హైప్ ఉండ‌గా.. అందుకు త‌గిన‌ట్టుగానే వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు వాళ్లు ఎక్క‌డ ఉంటే అక్క‌డ ఈ సినిమా కోసం ఆస‌క్తితో వెయిట్ చేశారు.

ఈ రోజు తెల్ల‌వారు ఝామునుంచే ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోయాయి. ఏపీ, తెలంగాణ‌లో ఉద‌యం 4 గంట‌ల‌కే ఫ‌స్ట్ షోలు ప‌డిపోయాయి. కొన్ని చోట్ల అయితే ఫ్యాన్స్ ఒత్తిడి చేసి మ‌రీ 2 గంట‌ల‌కే షోలు వేయించేసుకున్నారు. ఇక ఎక్క‌డిక‌క్క‌డ సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో బాల‌య్య అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేవు.

ఆంధ్ర‌, నైజాం, సీడెడ్‌, ఓవ‌ర్సీస్ తేడా లేకుండా ఎక్క‌డ చూసినా థియేట‌ర్లు జై బాల‌య్య స్లోగ‌న్‌తో మార్మోగిపోతున్నాయి. ఇక ఈ సినిమాను ఈ రోజు బాల‌య్య కూడా త‌న అభిమానుల‌తో క‌లిసి చూసి ఎంజాయ్ చేశారు. ఈ రోజు ఉద‌యం 4 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లో భ్ర‌మ‌రాంబ థియేట‌ర్లో ప‌డిన షోకు బాల‌య్య‌తో పాటు ద‌ర్శ‌కుడు గోపీచంద్ కూడా హాజ‌ర‌య్యారు.

బాల‌య్య‌ను చూసిన అభిమానులు మ‌రింత ఉత్సాహంతో రెచ్చిపోయారు. షోకు వ‌స్తోన్న స్పంద‌న చూసి బాల‌య్య కూడా ఎంజాయ్ చేశారు. ఇక ఇదే షోకు ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా వ‌చ్చారు. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాలో బాల‌య్య‌కు జోడీగా శృతి హాసన్ నటించగా థమన్ సంగీతం అందించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news