Moviesఘట్టమనేని ఫ్యామిలీలో మళ్లీ మొదలైన రగడ.. అసలు వారసుడు ఎవరు..?

ఘట్టమనేని ఫ్యామిలీలో మళ్లీ మొదలైన రగడ.. అసలు వారసుడు ఎవరు..?

టాలీవుడ్ సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ ఈ మధ్యనే మరణించిన విషయం తెలిసిందే. వయస్సు మీద పడుతున్న కానీ ఫుల్ ఆరోగ్యంగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ కొన్ని మెంటల్ టెన్షన్స్ వల్ల ఎక్కువ డిప్రెషన్స్ కి లోనై హార్ట్ ఎటాక్ వచ్చిందన్న న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించింది . ఆ క్రమంలోనే ఆయన ప్రెసర్ తట్టుకోలేక బాడీ పార్ట్స్ అన్ని ఫ్లాప్ అయ్యాయని ఈ కారణంగానే సూపర్ స్టార్ కృష్ణ మరణించారని తెలుస్తుంది.

కాగా సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు అన్న మరణ వార్తను ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నాడు ఆయన కొడుకు మహేష్ బాబు. మనకు తెలిసిందే కృష్ణ మరణించేమూడు నెలల ముందే మహేష్ బాబు అమ్మగారు ఇందిరాదేవి మరణించారు . ఇలా మూడు నెలల వ్యవధిలోని తల్లిదండ్రులను పోగొట్టుకున్న మహేష్ బాబు ఇంకా ఆ విషాదఛాయ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. అయితే తన నమ్ముకున్న సినిమా జనాలు లాస్ అవ్వకూడదనే కారణంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తెరకెక్కే సినిమా సెకండ్ షెడ్యూల్ ని ఎనిమిదో తేదీ నుంచి మొదలు పెట్టనున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీలో కొత్త రగడ మళ్ళీ మొదలైంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మనకు తెలిసిందే మొదటి నుంచి ఘట్టమనేని ఫ్యామిలీ అసలు వారసుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. కొందరు మహేష్ బాబు అంటే మరి కొందరు నరేష్ అంటూ ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటారు . కాగా సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత ఘట్టమనేని బాధ్యతలు తీసుకునే అర్హత పూర్తిగా మహేష్ బాబుకే ఉంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్న క్రమంలో నరేష్ ఫాన్స్ సైతం అదే రేంజ్ లో ఆయన పేరుని బలంగా వినిపిస్తున్నారు . ఇంటికి పెద్దదిక్కుగా నరేష్ ఉండగా మహేష్ బాబు ఎలా ఆ బాధ్యతలు తీసుకుంటాడని ..మహేష్ బాబు ఘట్టమనేని ఫ్యామిలీ అసలైన మొదటి వారసుడు అని ఆ తర్వాతే నరేష్ అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ అసలైన వారసుడు ఎవరు మహేష్ బాబునా..? నరేష్ నా..? అంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా సరే సూపర్ స్టార్ కృష్ణ మరణించిన తర్వాత ఘట్టమనేని ఫ్యామిలీలో గొడవలు ఎక్కువ అయ్యాయి అన్నది మాత్రం వాస్తవం అంటూ సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news