Moviesడీజే టిల్లు 2 లో మితిమీరిన శృంగారం..హీరోయిన్ పాత్ర మరీ టూమచ్...

డీజే టిల్లు 2 లో మితిమీరిన శృంగారం..హీరోయిన్ పాత్ర మరీ టూమచ్ .. అసలు విషయం బయటపెట్టిన అనుపమ..!?

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ డీజే టిల్లు 2 సినిమా నుంచి తప్పుకోవడం. మనకు తెలిసిందే సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయిందో. నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఎటువంటి అంచనాల లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయ్యి .. ఇండస్ట్రీ లెక్కలను తిరగ రాసింది. పెట్టిన దానికి ఏకంగా 10 రెట్లు ఎక్కువ లాభాలు తీసుకొచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది.

కాగా ఈ క్రమంలోనే ఆ సినిమాకి సీక్వెల్ కూడా తీయాలని అప్పుడే డిసైడ్ అయిపోయాడు నాగ వంశీ . కాగా దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చేశారు. షూటింగ్ పై ఎప్పటికప్పుడు క్రేజీ అప్డేట్స్ ఇస్తూనే వచ్చారు . కాగా మొదటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంత ప్రాధాన్యం కలిగిందో తెలిసిందే. అయితే డీజే టిల్లు లో హీరోయిన్గా నటించిన నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం లేదు అంటూ మేకర్స్ ముందే హింట్ ఇచ్చారు. ఇక తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల సెలక్ట్ అయ్యిందంటూ వార్తలు వినిపించాయి.

అయితే కొన్ని అనివార్య కారణాల కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది . అదే క్రమంలో అనుపమ పరమేశ్వరి సెలెక్ట్ అయినట్లు మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాదు త్వరలోనే అఫిషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ మ్యాటర్ లీక్ అయ్యింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ..ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ కూడా తప్పుకున్నట్టు తెలుస్తుంది . ఈ సినిమాలో మితిమీరిన రొమాన్స్ ఉందని.. అందు కారణంగానే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవ్వరు చేయట్లేదని ఓ న్యూస్ వైరల్ గా మారింది.

అంతే కాదు హీరోయిన్ క్యారెక్టర్ మరి టూమచ్ గా ఉంటుందని అందుకే స్క్రిప్ట్ విన్న అనుపమ తప్పుకుంది అని టాక్ వినిపిస్తుంది. అయితే దీని పై పరోక్షకంగా కామెంట్ చేసింది అనుపమ . తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేస్తూ..”ఒకచోట ఎగ్జిట్ అయితే మరొకచోట ఎంట్రీ ఉంటుంది” అంటూ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పకనే చెప్పేసింది అంటున్నారు అభిమానులు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news