Movies"హమ్మయ్య..ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది"..కీర్తి సురేష్ పోస్ట్ వైరల్..!!

“హమ్మయ్య..ఇప్పుడు నా మనసుకు ప్రశాంతంగా ఉంది”..కీర్తి సురేష్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ..ఎంత అందగత్తెఓ ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చీర కడితే కుందనపు బొమ్మలా ఉంటుంది. నిజంగానే ఆ దేవకన్య దివి నుంచి భువి లోకానికి దిగి వచ్చిందా..? అన్నంత డౌట్లు కలగజేస్తుంది . అంత చక్కగా ఉండే కీర్తి సురేష్ ..ఈమధ్య రూట్ తప్పింది . మోడ్రన్ వేర్ లో బార్బీ బొమ్మలా తయారైంది . ఎక్కడ ఏమి దాచుకోకుండా హాట్ఫిగర్ ని ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు అందాల ట్రీట్ ఇస్తుంది.

దానికి రీజన్ కూడా తెలిసిందే. కీర్తికి ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రాలేదు . ఆ కారణంగానే కీర్తి తన బాడీ పార్ట్స్ ను ఎక్స్పోజ్ చేస్తూ ..అవకాశాలు సంపాదించుకుంటుంది అన్న టాక్ బలంగా వినిపిస్తుంది. కాగా ప్రజెంట్ టాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి సురేష్.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది . తన పరసనల్ విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది . రీసెంట్గా కీర్తి సురేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన పూర్వీకుల సొంత గ్రామానికి వెళ్ళినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోనే కీర్తి సురేష్ అక్కడ దిగిన ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది . దీంతో చాలా కాలం తర్వాత సొంత వాళ్ళని కలుసుకున్న కీర్తి సురేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. చిన్నపిల్లలా మారిపోయి అల్లరి అల్లరి చేస్తూ సరదా సరదాగా గడిపింది. అంతేకాదు ఎనిమిదవ దశాబ్దము లో నిర్మించిన నంబి పెరుమాళ్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలల్లో పాల్గొన్నారు. ఈ పిక్స్ ని షేర్ చేస్తూ..” నా మనసుకు ప్రశాంతంగా ఉంది ” అంటూ రాసుకొచ్చింది కీర్తి సురేష్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news