Moviesఛాన్సుల కోసం కడుపులో బిడ్డను చంపుకున్న హీరోయిన్ సుకన్య.. భర్తకు తెలియ‌కుండా...

ఛాన్సుల కోసం కడుపులో బిడ్డను చంపుకున్న హీరోయిన్ సుకన్య.. భర్తకు తెలియ‌కుండా మోసం…!

తమిళ సినిమాల ద్వారా పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న నటి సుకన్య. ఆమె 1991లో మొట్ట మొదటగా తమిళ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది. ఒక్క ఏడాదిలోనే తెలుగు, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీల్లో బిజీ హీరోయిన్ అవ్వడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక సుకన్య హీరోయిన్ అవ్వడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి ఒక నిర్మాత కావడమే. సుకన్య తమిళ నిర్మాత రమేష్ కూతురు. భారతి రాజా దర్శకత్వంలో పుదు నెల్లు పుదు నాథు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె డ్యాన్సర్ గా చాల పాపులర్.

చంద్రలేఖ వంటి పేమస్ డ్యాన్సర్ దగ్గర స్కాలర్ షిఫ్‌తో డ్యాన్స్ నేర్చుకుంది. ఇదే బృందం రష్యాలో సైతం 1987లో పర్యటించి చిన్న వయసులో ఫెస్టివల్ అఫ్ ఇండియాలో పాల్గొని రికార్డు సృష్టించింది. ఈ ఉత్సవాల్లో ఇండియా నుంచి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఇక క్రెమ్లిన్ స్క్వేర్లో, మిఖాయిల్ గోర్బచేవ్ వంటి ప్రముఖుల ముందు ఆమె డ్యాన్స్ చేసింది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సౌత్ ఇండియాలో 200 సినిమాల వరకు నటించింది.

కేవలం నటిగానే కాకుండా మ్యూజిక్ ఆల్బమ్స్ కూడా చేసింది. ఆమెకు సంగీతం పట్ల ఎంతో మంచి నైపుణ్యం ఉంది. ఇక తనకు సంగీతంలో గురువు ఎవ్వరు లేకపోవడం విశేషం. ఒకవేళ సినిమాల్లో సంగీతం సమకూర్చే అవకాశం ఇచ్చిన తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ సుకన్య చెప్పారు. సినిమాల విషయంలో ఆమెకు ఎలాంటి వివాదాలు లేవు.. ఆమెను ఆ విషయంలో తప్పు పట్టేంత పెద్ద విషయాలు కూడా లేవు. కానీ వ్యక్తి గత జీవితంలో మాత్రమే ఆమెకు ఆమె పెద్ద విలన్ అని చెప్పాలి. ఎంతటి విలన్ అంటే సినిమాల మీద ఉన్న పిచ్చితో ఏకంగా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకుంది.

కెరీర్ డౌన్ ఫాల్ అయినా తర్వాత 2002లో అమెరికా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీధరన్ బాలాజీని అమెరికాలో వెంకటెశ్వర ఆలయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక కొన్నాళ్ల పాటు ఇద్దరు ఎంతో అనోన్యంగా ఉండేవారు. కానీ కొన్నాళ్ళకు తమిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆనందం అనే సీరియల్ లో మెయిన్ లీడ్ కోసం అవకాశం వచ్చింది. అ సమయంలో ఆమె గర్భవతి. అయినా కూడా ఆమె సీరియల్ అవకాశం కోసం ఉబలాట పడింది.

ఎవరైనా గర్భవతి అయితే మరో కొత్త జీవితం ప్రారంభించినట్టే అనుకుంటారు. కానీ సుకన్య మాత్రం కెరీర్ పైన ఉన్న పిచ్చి ప్రేమతో భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంది. ఆ ఆతర్వాత ఇండియా కూడా వచ్చేసింది. ఇక సీరియల్ లో నటించడం మొదలు పెట్టింది. ఇక్కడితో ఆగితే సుకన్య జీవితంలో ఇంతా పెద్ద వివాదం జరిగి ఉండేది కాదు. కానీ ఆనందం సీరియల్ మెగా సీరియల్ కావడంతో ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది.

ఇదే అదనుగా భర్తపై వేధింపుల కేసు పెట్టి విడాకులు కోరింది. దాంతో నోటీసు అందుకున్న శ్రీధర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. పరుగున ఇండియా కి వచ్చిన శ్రీధర్ సుకన్య అబార్షన్ చేయించుకున్న విషయాన్నీ మీడియా ముందు పెట్టాడు. ఇక పెళ్లయిన ఏడాది లోపే వారికి విడాకులు వచ్చాయి. ఆ త‌ర్వాత సుక‌న్య ప్రాస్టిట్యూష‌న్ కేసులో రెండు మూడుసార్లు చిక్కుకున్న‌ట్టు కూడా ఆరోప‌ణలు ఎదుర్కొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news