Moviesఒక్క అబద్ధంతో స్టార్ డైరెక్టర్ గా మారిన పూరీ జగన్నాధ్...!!

ఒక్క అబద్ధంతో స్టార్ డైరెక్టర్ గా మారిన పూరీ జగన్నాధ్…!!

ఒక్కోసారి అబ్బధాలు కూడా మనకు మంచి చేస్తాయి అంటే..ఇదే కాబోలు. స్టార్ డైరెక్టర్ గా మన ముందు నిలబడ్డ పూరీ జగన్నాధ్ ..ఒకప్పుడు అబ్బధం చెప్పి..ఇప్పుడు ఈ పోజీషన్ లో ఉన్నారట. మనకు తెలిసిందే..పూరి జగనాధ్ స్టైల్ నే వేరు. అందరిలా ఆయన సినిమాలు తీయ్యడు. ఒక్కో సినిమా కి మూడేళ్ళు నాలుగేళ్ళు టైం వేస్ట్ చేయడు. కట్టే..కొట్టే ..తెచ్చే టైప్ పూరీ జగన్నాధ్.

కధ రాసుకున్నాడా.. ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకుంటాడు. ఒకరు రిజెక్ట్ చేసినా మరో ఇద్దరు అప్షన్ లో ఉంటారు. ప్రోడక్షన్ పనులు పూర్తి చేసి..సరాసరి, సినిమా షూటింగ్ ను ఏడు నెలలు లో పూర్తి చేసి..సినిమా అనౌన్స్ మెంట్ రోజే..రిలీజ్ డేట్ కూడా చెప్పేస్తారు. అలాంటి పక్క పానింగ్ ఉన్న వ్యక్తి. ప్రజెంట్ ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అనే కానీ, ఒకప్పుడు పూరి సినిమాలు అంటే..పడి చచ్చిపోయేవారు.

అయితే, పూరీ జగన్నాధ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బద్రి సినిమా టైం లో జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ రోజుల్లో ముందు పవన్ కు స్టోరీ చెప్పాలంటే..ముందుగా ఆయన అసిస్టెంట్ కి కధ వినిపిస్తే..అది ఆయనకు నచ్చితేనే..పవన్ వరకు పంపించేవారట.

అలా పూరీ జగన్నాధ్..మొదట పవన్ అసిస్టెంట్ కి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను చెప్పి..ఆయనను మెప్పించి..ఫైనల్ గా పవన్ దగ్గరికి వెళ్ళి…ఆయన బద్రి సినిమా స్టోరీ చెప్పారు. ఈ సినిమా పవన్ కు పిచ్చగా నచ్చేయడంతో వెంటనే ఓకే చేసి..సినిమా లో కొత్త హీరోయిన్ గా రేణు దేశాయ్ ని తీసుకుని..మరో క్లాసిక్ హీరోయిన్ గా అమీషా పటేల్ ని సెలక్ట్ చేసుకుని సినిమా తెరకెక్కించి రిలీజ్ చేసారు. ఈ సినిమా ఎంతటి హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పూరీ జగన్నాధ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్ గా నిలిచింది. అలా ఆ చిన్న అబ్బధం తో పూరీ స్టార్ హీరో అయ్యాడనమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news