Moviesనాలాగా ఎవ్వరు చేయలేరు.. మహేశ్ చెప్పింది నిజమేగా..!

నాలాగా ఎవ్వరు చేయలేరు.. మహేశ్ చెప్పింది నిజమేగా..!

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన సినిమా “సర్కారు వారి పాట” మరి కొద్ది గంటల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ధియేటర్స్ వద్ద సందడి వాతవరణం నెలకొంది. అరుపులు..కేకలు..జై మహేశ్ అంటు నినాదాలు..ఇవన్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ మళ్లీ వచ్చిన్నట్లు ఉంది. ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సులే ఎక్కువ ఉన్నాయి అంటున్నారు జనాలు. సినిమా లో మహేశ్శ్ కీర్తి లవ్ ట్రాక్..వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్.. ముఖ్యంగా మహేశ్ నోటి నుండి వచ్చే ప్రతి డైలాగ్ ఓ బాంబ్ లా పేలుతుంది అంటూ టాక్ బయటకు వచ్చింది.

అది నిజమో కాదో మరి కొద్ది గంటల్లోనే తెలిసిపోతుంది. కాగా, ఈ సినిమా డైరెక్టర్ పరశూరామ్ ప్రమోషన్స్ ని కూడా చాలా కూల్ గా ఎటువంటి హంగామా లేకుండా.. సైలెంట్ గా మ్యాటర్ ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే కీర్తి సురేష్, పరశూరామ్, మహేష్..సినిమాకి మంచి పబ్లిసిటీ ఇచ్చారు. ప్రమోషన్స్ లో చురుగా పాల్గొని సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసారు. ఈ క్రమంలోనే మహేశ్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ సినిమాకి సంబంధించిన ఆసక్తి కర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ క్రమంలోనే.. ఆయన మాట్లాదుతూ..” సినీ ఇండస్ట్రీలో నాలా ఎవ్వరు కూడా మిమిక్రి చేయలేరు. నా వాయిస్ దగ్గరగా మ్యాచ్ చేయచ్చు ఏమో కానీ..పూర్తిగా నా వాయిస్ లా రాదు. నా వాయిస్ ని క్యాచ్ చేయటం అంత ఈజీ కాదని అందుకే ఎవరూ చేయలేదని ” చెప్పుకొచ్చారు. అంతేకాదు, రిపోర్టర్స్ “మీరు ఎప్పుడు హ్యాండ్ సమ్ గా నే కనిపిస్తారు. మీ డైట్ సీక్రేట్” అని అడగ్గా..మహేశ్..”అలాంటిది ఏం లేదు, ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా..మితంగా తింటే..అంతే చాలు..నేను చేసేది అదే. పెద్దగా ఏం ఫాలో అవ్వను” అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కళావతి పాట అంటే చాలా ఇష్టమని చెప్పిన ఆయన..” నేను విన్నాను-నేను ఉన్నాను” అనే డైలాగ్ ఎందుకు చెప్పాలిసి వచ్చిందో సినిమా చూస్తే మీకే అర్ధమౌతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news