Moviesఅతిలోక సుంద‌రి శ్రీదేవితో ముగ్గురు హీరోల పెళ్లి సంబంధాలు..!

అతిలోక సుంద‌రి శ్రీదేవితో ముగ్గురు హీరోల పెళ్లి సంబంధాలు..!

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి మూడున్నర దశాబ్దాల పాటు భారతీయ సినిమా పరిశ్రమలో మకుటంలేని మహారాణిలా ఓ వెలుగు వెలిగింది. సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలో శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సౌత్ ఇండియాలో లక్షలాది మంది సినీ అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న శ్రీదేవి ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవి నేషనల్ హీరోయిన్ అయిపోయింది. అస‌లు ఆ త‌ర్వాత ఆమెను సౌత్ సినిమాల్లో న‌టింప‌జేసేందుకే చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది ద‌ర్శ‌క నిర్మాత‌లు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తో ప్రేమలో పడి పెళ్లికి ముందే సహజీవనం చేశారు.
అప్పటికే బోనికపూర్ కు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కూడా శ్రీదేవి బోనీని పెళ్లాడింది. అయితే శ్రీదేవికి బోనీకపూర్ తో పెళ్లి జరగడానికి ముందే ముగ్గురు హీరోలతో పెళ్లి సంబంధాలు వచ్చాయి. అయితే ఈ మూడు పెళ్లి సంబంధాలు కూడా సెట్ కాలేదు. శ్రీదేవి సౌతిండియాలో స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే సీనియర్ హీరో రాజశేఖర్‌తో పెళ్లి ప్రస్తావన వచ్చిందట. శ్రీ దేవి తల్లి స్వయంగా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాజశేఖర్‌ను కోరారట.

ఈ విషయాన్ని రాజశేఖర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే అప్పుడు రాజశేఖర్ కెరీర్ లో బిజీగా ఉండటంతో ఈ పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినట్టు తెలిసింది. రాజ‌శేఖ‌ర్‌కు శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాల‌ని శ్రీదేవి త‌ల్లికి బ‌లమైన కోరిక ఉండేద‌ట‌. ఆ తర్వాత సీనియర్ హీరో మురళీమోహన్ తో కూడా శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలన్న ప్రస్తావన వచ్చిందట. మురళీమోహన్ కూడా అప్పుడప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. ఆయన కూడా అప్పుడే కెరీర్‌లో ఎదుగుతూ ఉండ‌డంతో పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. అదో స‌ర‌దాగా వ‌చ్చిన పెళ్లి ప్ర‌స్తావ‌నే అని ముర‌ళీ మోహ‌న్ తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ఆ తర్వాత శ్రీదేవి బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయారు. అప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న మిథున్‌ చక్రవర్తితో చాలా రోజుల పాటు సీక్రెట్‌గా సహజీవనం కూడా చేసినట్టు బాలీవుడ్ అంతా ఒకటే కోడై కూసింది. వీరిద్ద‌రి జంట అంటే బాలీవుడ్ జ‌నాలు ప‌డి చ‌చ్చేవారు. అప్పటికే మిధున్ చక్రవర్తికి యోగితా బాలీతో పెళ్లి జరగడంతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీదేవి తల్లి యోగితకు విడాకులు ఇస్తే.. తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానని కండీష‌న్‌ పెట్టారట.

అయితే యోగిత‌ను తాను పెళ్లి చేసుకున్నాకే తనకు ఈ స్టార్‌డ‌మ్‌ వచ్చిందని.. మిథున్‌ చక్రవర్తి ఆమెకు విడాకులు ఇవ్వ‌న‌ని చెప్పేశార‌ట‌. తన భార్య యోగిత‌కి విడాకులు ఇవ్వకుండానే శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకుంటానని అడిగారట. అయితే అందుకు శ్రీదేవి ఒప్పుకోకపోవడంతో మిథున్ చక్రవర్తితో కూడా శ్రీదేవి పెళ్లి జరగలేదు. చివరకు శ్రీదేవి అటు ఇటు తిరిగి అప్పటికే పెళ్లి అయినా బోనీ క‌పూర్‌తో ప్రేమలో పడింది. చివరకు బోనీ సైతం శ్రీదేవిని మాయచేసి పెళ్లికి ముందే గర్భవతిని చేశారని… ఆ తర్వాతే వీరు పెళ్లి చేసుకున్నారు అని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news