Moviesమళ్లీ సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఇదే..సంచలన మ్యాటర్ బయటపెట్టిన భాగ్యశ్రీ..!!

మళ్లీ సినిమాల్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఇదే..సంచలన మ్యాటర్ బయటపెట్టిన భాగ్యశ్రీ..!!

భాగ్యశ్రీ…పేరు కు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపేసిన భాగ్యశ్రీ. తన నటనతో అందంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న బ్యూటీ. చూడగానే ఆకట్టుకునే చిరునవ్వు..దానికి తగ్గట్లు ఉండే చ‌క్క‌టి మొహం.. పాలు లా ఉండే తెల్లటి రంగు..ఇక ఆ హెయిర్ వదిలేసి న‌వ్వితే ఉంటాదు చూడండి..కుర్రాళ్ల గుండెలో గిటార్ మొగాల్సిందే. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఆమె అందానికి దాసోహ‌మ‌వ్వాల్సిందే. మైనే ప్యార్ కియా చిత్రం ద్వార బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా ఈ ముద్దుగుమ్మ అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అటేటస్ సంపాదించుకుంది.

మైనే ప్యార్ కియా సినిమా ద్వార భాగ్యశ్రీ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది. ఈ సినిమా తరువాత ఆమె బడా బడా స్టార్స్ తో కూడా కలిసి నటించే అవకాశం అందుకుంది. అయితే త్వరగానే పెళ్లి చేసుకుని పిల్లలని కనేసిన ఈమె..మళ్లీ ఇన్నాళ్లకు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్‌’ లో కీలక పాత్ర చేశారు భాగ్యశ్రీ. ఇప్పటికీ ఆమెను చూస్తే ఆమెకు వయస్సు పెరిగిందంటే అస్సలు నమ్మలేరు. ఆమెను చూస్తే 30 ఏళ్లు మాత్రమే అనుకుంటారు. అంత చక్కగా తన అందాని మెయిన్ టైన్ చేస్తుంది.

ఇక ‘రాధేశ్యామ్‌’ సినిమా ఈ నెల 11న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఆమె ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..తాను సినిమాలోకి మళ్ళీ ఎందుకు రావాల్సి వచ్చిందో..చెప్పుతూ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. నటన పై ఉండే ఇంట్రెస్ట్ తో సినిమాలోకి వచ్చిన ఈ అమ్మడు..పెళ్ళి తరువాత ఓ హౌస్ వైఫ్ గా..ఓ తల్లిగా తన బాధ్యతలను చూసుకోవాలని..సినిమాలకి దూరం అయ్యిందట. కానీ ఇప్పుడు పిల్లలు పెద్ద వాళ్లు అయ్యారు. వాళ్లే ఆమెకు సజీస్ట్ చేశారట. “మమ్మి నువ్వు సినిమాలో ట్రై చెయ్యి..మళ్ళీ నీ డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకో” అంటూ..ఇక ఆమె భర్త కూడా ఎటువంటి కండీషన్స్ పెట్టకుండా తనని సినిమాలో అంటించడానికి ఒప్పుకుని బాగా హెల్ప్ చేశారట. అందుకే నేను మళ్లీ సినిమాలు చేయడానికి సిద్ధపడ్డాను అంటూ క్లారిటీ ఇచ్చింది భాగ్య.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news