Moviesమ‌హేష్ - రాజ‌మౌళి సినిమాపై కేక పెట్టించే న్యూస్‌

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై కేక పెట్టించే న్యూస్‌

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా లేటెస్ట్ సినిమా స‌ర్కారు వారి పాట చేస్తున్నారు. గీత‌గోవిందం ఫేం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా పొలిటిక‌ల్ అంశాల‌తో తెర‌కెక్కుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మేలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్టు తాజాగా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండూ కూడా క్రేజీ ప్రాజెక్టులే..! ఒక‌టి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమా. మ‌రొక‌టి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా.

మ‌హేష్ – రాజ‌మౌళి కాంబోలో సినిమా కోసం 15 ఏళ్లుగా సినీ అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వీరి కాంబోలో సినిమా సెట్ అవుతోంది. సింహాద్రి సినిమా త‌ర్వాత అగ్ర నిర్మాత డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ రాజ‌మౌళికి అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అడ్వాన్స్ నేప‌థ్యంలోనే ఇప్పుడు రాజ‌మౌళి ఆ బ్యాన‌ర్‌కు సినిమా చేస్తున్నారు. ఇక అదే టైంలో కేఎల్‌. నారాయ‌ణ మ‌హేష్‌కు కూడా అడ్వాన్స్ ఇచ్చి ఉండ‌డంతో ఈ కాంబినేష‌న్‌కు ఇప్ప‌ట‌కి ముహూర్తం కుదిరింది.

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా అన్న వెంట‌నే హాలీవుడ్ రేంజ్ క‌థ‌తో తెర‌కెక్కుతోంద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాజ‌మౌళి కూడా క‌థ జేమ్స్‌బాండ్ స్టైల్లో ఉంటుంద‌ని చెప్పారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాకి స్టోరీ ఇస్తోన్న ప్రముఖ స్టార్ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్ స‌బ్జెక్ట్ రెడీ చేసేశార‌ట‌.

ఇక రాజ‌మౌళి కూడా ఈ క‌థ‌పై చ‌ర్చ‌ల్లో పాల్గొని స‌జెష‌న్లు చేస్తే ఫుల్ బౌండెండ్ స్క్రిఫ్ట్ కూడా రెడీ అయిపోయిన‌ట్టే..! ఈ సినిమాను సెట్స్ మీద‌కు తీసుకువెళ్లేందుకు రాజ‌మౌళికి మ‌రింత టైం ఉంది. స‌ర్కారు వారి పాట త‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమా ఫినిష్ చేశాక‌.. ఈ ప్రాజెక్టు సెట్స్ మీద‌కు వెళుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news