Moviesఎన్టీఆర్ - ప‌వ‌న్ - మ‌హేష్‌కు ఆ స్టార్ హీరోయిన్‌తో ఉన్న...

ఎన్టీఆర్ – ప‌వ‌న్ – మ‌హేష్‌కు ఆ స్టార్ హీరోయిన్‌తో ఉన్న కామ‌న్ లింక్ ఇదే..!

టాలీవుడ్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు ముగ్గురు కూడా ఇప్పుడు స్టార్ హీరోలుగా ఓ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా వ‌సూళ్ల‌లో కాని.. న‌ట‌న‌లో కాని.. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కూడా ముగ్గురిలో ఎవ్వ‌రూ కూడా ఒక‌రికి ఒక‌రు తీసిపోరు. అయితే ఈ ముగ్గురి కెరీర్‌లో 7వ సినిమా చాలా ప్ర‌త్యేక‌మైన సినిమా గా మిగిలిపోయింది.

ప‌వ‌న్ కెరీర్‌లో 7వ సినిమాగా వ‌చ్చిన ఖుషీ సూప‌ర్ హిట్‌. మ‌హేష్ కెరీర్‌లో 7వ సినిమా ఒక్క‌డు సూప‌ర్ హిట్‌. ఎన్టీఆర్ కెరీర్‌లో 7వ సినిమా సింహాద్రి కూడా సూప‌ర్ హిట్‌. ఖుషీ సినిమా 2001లో వ‌చ్చింది. ఎస్‌. జె. సూర్య ద‌ర్శ‌కుడు.. 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఇక ఒక్క‌డు సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడు.. ఈ సినిమా 130 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్ప‌టి వ‌ర‌కు ఉన్న తెలుగు సినిమా రికార్డుల‌కు పాత‌రేసింది.

ఇక సింహాద్రి సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా కూడా 150 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అలాగే 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. అయితే ఈ స్టార్ హీరోల కెరీర్‌లో 7వ సినిమాలుగా వ‌చ్చిన ఈ మూడు కూడా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం భూమిక‌.

ఖుషీ సినిమాలో ముందుగా భూమిక‌ను హీరోయిన్గా సెల‌క్ట్ చేసుకున్నారు. ఆ సినిమాలో బొడ్డు సీన్‌తో ఆమె సంచ‌ల‌న‌మే రేపింది. ఆ త‌ర్వాత ఒక్క‌డు సినిమాలో గుణ‌శేఖ‌ర్ భూమిక‌ను తీసుకున్నా ఆమెకు పొంగు రావ‌డంతో కొద్ది నెల‌ల పాటు సినిమా లేట్ అయ్యింది. ఇక రాజ‌మౌళి ఎన్టీఆర్ ప‌క్క‌న భూమిక సెట్ అవుతుంద‌నే ఆమెను సెల‌క్ట్ చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news