Moviesవెయ్యి మందితో వెండితెర‌పై పుష్ప అదిరిపోయే ఫీస్ట్‌..క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్..!!

వెయ్యి మందితో వెండితెర‌పై పుష్ప అదిరిపోయే ఫీస్ట్‌..క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్..!!

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘పుష్ప’. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’.రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌లో విడుదల అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. ఈ క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో బన్నీ పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తుంది. శ్రీ వ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక డీ గ్లామ‌ర్ లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ర‌ష్మీక గిరిజ‌న అమ్మాయిగా కనిపించబోతుంది. ఇక బ‌న్నీ కూడా అదే తరహాలో ఆమెను ప్రేమించే గిరిజ‌న యువ‌కుడి గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అయితే, ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి ..” సామి సామి ” సాంగులు విడుదలై… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్‌డేట్ అయిన అభిమానుల‌కి ఆస‌క్తిగా మారుతుంది.తాజాగా చిత్రం నుండి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. వెయ్యి మంది సాంగ్‌తో ప్లాన్ చేశార‌ని, ఇది వెండితెర‌పై అదిరిపోయే ఫీస్ట్‌గా మారుతుంద‌ని అంటున్నారు. ఓ పోస్ట‌ర్ కూడా చిత్ర బృందం విడుద‌ల చేయ‌గా, ఇది ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. మొదటి భాగమైన ‘పుష్ప ది రైజ్​’ను డిసెంబరు 17న థియేటర్లలో విడుదల చేయనుంది చిత్రబృందం. రిలీజ్​ డేట్​ దగ్గరు పడనుండడం వల్ల సినిమా ప్రమోషన్స్​లో జోరు చూపిస్తోంది చిత్రబృందం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news