Moviesనంద‌మూరి పండ‌గ‌: క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్లో బాల‌య్య‌... డైరెక్ట‌ర్ కూడా ఫిక్సే..!

నంద‌మూరి పండ‌గ‌: క‌ళ్యాణ్‌రామ్ బ్యాన‌ర్లో బాల‌య్య‌… డైరెక్ట‌ర్ కూడా ఫిక్సే..!

తెలుగు సినిమా చరిత్రలో నందమూరి ఫ్యామిలీ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ తర్వాత ఆ వంశంలో రెండో తరం హీరోగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో సీనియర్ హీరో గా తన ముద్ర వేసుకున్నారు. ఇక ఇదే వంశం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగులోనే నెంబర్ వ‌న్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఈ తరం హీరోలలో ఎన్టీఆర్ చేసిన పాత్రలు ఏ హీరో చేయ‌రంటే అతిశయోక్తి కాదు. ఇక ఇదే వంశం నుంచి మరో హీరో గా ఉన్న నందమూరి కళ్యాణ్‌రామ్ సైతం హీరోగా నటిస్తుండటంతో పాటు తన తాత ఎన్టీఆర్ పేరుపై స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇక నందమూరి వంశంలో హీరోల‌ కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ – బాలయ్య కలిసి సినిమా చేయాలని ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్‌ బ్యానర్ లో ఎన్టీఆర్ జై లవకుశ సినిమా చేశారు. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య , కళ్యాణ్ రామ్ కలిసి నటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

కళ్యాణ్ రామ్ బ్యానర్లో బాలయ్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు టాలీవుడ్ డేరింగ్‌ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తార‌ని తెలుస్తోంది. బాల‌య్య – పూరి కాంబోలో ఓ సినిమా వ‌స్తుంద‌న్న ప్రచారం గ‌త రెండేళ్లుగా ఉంది. ఇదే విషయాన్ని పూరీ కూడా గ‌తంలో చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో పైసా వసూల్ సినిమా వచ్చింది.

ఇక తాజాగా బాలయ్య కోసం పూరీ రెడీ చేసిన కథలో బాలయ్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. బాలయ్య పాత్ర కోసం పూరీ జగన్నాథ్ చాలా జాగ్రత్తలు తీసుకుని మరి క‌థ రూపొందించారని… ఇప్పటికే ఈ కథ విన్న బాల‌య్య‌ ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదు అని అంటున్నారు. ఏదేమైనా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో సినిమా వస్తే నందమూరి ఫ్యాన్స్ ఇంత‌కు మించిన‌ పెద్ద పండుగ ఉండ‌దు అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news