Moviesవాళ్ల పై అమితాబ్ సీరియస్..లీగల్‌ నోటీసు కూడా పంపారట..!!

వాళ్ల పై అమితాబ్ సీరియస్..లీగల్‌ నోటీసు కూడా పంపారట..!!

అమితాబ్ బచ్చన్..బాలివుడ్ లెజండరి యాక్టర్. ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని బాలీవుడ్ లో ఎందరో హీరొలు తెరంగేట్రం చేసారు. ఈయన యాక్టింగ్ స్కిల్స్ కు ఫిదా అవ్వని వారంటూ ఉండరేమో అనడంలో ఆశ్చర్య లేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ..మరోవైపు ప‌లు టీవీ షోల‌లోను పాల్గొంటున్నారు. అయితే ఈయన సినిమాలతో పాటు పలు బ్రాండ్ ను కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు అన్న విషయం తెలీసందే.

ఈ కరమంలో అమితాబ్ బచ్చన్ ఒక పాన్‌ మసాల బ్రాండ్‌ ను కూడా ప్రమోట్ చేసారు. కాగా కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ తనతో కూడిన టీవీ వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేస్తున్నారంటూ
అమితాబ్ బచ్చన్ మండిపడ్డారు. వాళ్ళకు లీగల్ నోటీసు పంపించారు. యువకులు పొగాకుకు అలవాటు పడకుండా చేయడంలో సహాయపడటానికి పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రచారం మానుకోవాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ అభ్యర్థించడంతో అక్టోబర్‌లో కమ్లా పసంద్ ప్రచారం నుండి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక ఈ ప్రచారం కోసం బచ్చన్ సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అయిన సంగతి తెలిసిందే .

ఈ ప్రకటనల ప్రసారం రద్దు చేయాలని ‘కమలా పసంద్‌’ పాన్‌ మసాల బ్రాండ్‌కు అమితా బచ్చన్‌ కార్యాలయం నుంచి లీగల్‌ నోటీస్‌ వెళ్లింది. ఇకపై పాన్‌ మసాల బ్రాండ్‌ ప్రమోషన్లతో అమితాబ్‌ బచ్చన్‌కు సంబంధం లేదని అక్టోబర్‌లో అమితాబ్‌ బచ్చన్‌ కార్యాలయం ఒక పోస్ట్‌ చేసింది. సెప్టెంబర్‌ 2021లో జాతీయ పొగాకు నిర్మూలన సంస్థ పాన్‌ మసాల ప్రకటనల నుంచి వైదొలిగి, పొగాకు వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నోట్‌ అ‍ధ్యక్షుడు డాక్టర్‌ శేఖర్ సల్కర్‌ బహిరంగ లేఖలో కోరారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news