Moviesఏం పాపం చేశారని ఇంత శిక్ష అంటూ ఏడ్చేసిన జెనీలియా..భర్త ఎమోషనల్..!!

ఏం పాపం చేశారని ఇంత శిక్ష అంటూ ఏడ్చేసిన జెనీలియా..భర్త ఎమోషనల్..!!

“బొమ్మ‌రిల్లు” ఈ చిత్రం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో రికార్డులు సృష్టించింది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్ లు గా సిధార్డ్,జెనిలియా నటించారు. ఇక సిద్దార్థ్‌, జెనిలియా కెరీర్ లో ది బెస్ట్ మూవీగా.. ఎవర్ గ్రీన్ మూవి ఉంది అంటే అది “బొమ్మరిల్లు” అనే చెప్పాలి. టాలీవుడ్‌లో బొమ్మరిల్లు సినిమాకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి హాసిని పాత్ర చాలా కృషి చేసిందనే చెప్పాలి.

ఇక కెర్రిర్ బాగా ముందుకు సాగుతున్న సమయంలోనే.. రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కనేసి..మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు సినిమాలు చేయనప్పటికి..ఇన్స్టా ఫన్ రీల్స్ తో తెగ ట్రెండింగ్‌లో నిలుస్తూ ఉంటుంది. సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది ఈ క్యూట్ రొమాంటిక్ కపుల్. బాలీవుడ్ స్టార్స్ అయిన రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా జంటకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ జంట సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.

రీసెంట్ గా కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో కి రితేష్ దేశ్ ముఖ్, జెనీలియాలు వచ్చారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని ప్రముఖ ఛానెల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇందులో క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన వీడియోని రితేష్‌, జెనీలియా దంపతులకు చూపించారు అమితాబ్. ఆ వీడియోకి చలించిపోయిన ఈ జంట కన్నీరు పెట్టుకుంటూ ఆ పిల్లలు పాపం చేశారని ఇలాంటి శిక్ష అనుభవిస్తున్నారని జెన్నీ కంటతడి పెట్టింది. అది చూసిన రితేష్‌ సైతం ఎమోషనల్‌ అయ్యాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news