Gossipsమహేష్ కోసం ఆ మాస్ బ్యూటీ ని లైన్ లో పెట్టిన...

మహేష్ కోసం ఆ మాస్ బ్యూటీ ని లైన్ లో పెట్టిన త్రివిక్రమ్..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలోనే “సర్కార్ వారి పాట” అనే సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సినిమాను ఆయన ఖాతాలో వేసుకునేందుకు రెడీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోండడం ఒక్క ప్లస్ పాయింట్ అయితే.. ఈ సినిమా స్టోరి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సాగుతుండడం మరో ప్లస్. దింతో ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఓ రేంజ్‌లో అంచనాలుంటాయి.”అతడు”, “ఖలేజా” వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మహేష్ బాబు కాంబో లో రాబోతున్న మూడవ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. 2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాల తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ‘అతడు’ సినిమాకు సీక్వెల్ అనే టాక్ వినబడుతోంది.ఇందులో బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుంది ఈ సినిమాకు ‘పార్ధు’ అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.

అయితే, ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉండటంతో.. నభా నటేష్ నటించనుందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ ప్రస్తుతం నితిన్ మాస్ట్రో సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుతో రొమాన్స్ కు నభా నటేష్ ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news