Moviesఇక పై అంతా ఫేస్ టు ఫేసే..వామ్మో..ఏందిరా నాయనా ఇది..??

ఇక పై అంతా ఫేస్ టు ఫేసే..వామ్మో..ఏందిరా నాయనా ఇది..??

కృతి కర్బందా .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. 2009లో ‘బోణి’ అనే తెలుగు సినిమాతో కృతి కర్బందా. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘తీన్మార్’ అనే సినిమా చేసింది. ఆతర్వాత రామ్ సరసన ‘ఒంగోలు గిత్త’ సినిమాలో మెరిసింది ఈ చిన్నది. చివరిగా రాంచరణ్ ‘బ్రూస్ లీ’ సినిమాలో అక్కగా కనిపించింది.

అయితే తెలుగులో ఊహించినంత సక్సెస్ లభించకపోవడంతో.. బాలీవుడ్‌కి మకాం మార్చేసింది కృతి. అక్కడ ఈ భామకు మంచి సినిమాలే పడ్డాయి. స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసి తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం ఆమె ‘14 ఫేరే’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధిచిన ట్రైలర్ ఈ మధ్యే విడుదలై విశేషంగా అలరిస్తోంది.

తాజాగా తన మూవీని ప్రమోషన్‌లో భాగంగా ఫ్యాన్స్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది కృతి. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వీడియోని ఆమె షేర్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ అందరికీ నచ్చిందని భావిస్తున్నానని, అయితే ట్రైలర్‌లో తమకు నచ్చిన విషయాలేంటో చెప్పాలని ఫ్యాన్స్‌ను కోరింది. ఎవరైతే తనకు నచ్చిన అంశాల్ని ప్రస్తావిస్తారో వారితో జూమ్‌ కాల్‌లో మాట్లాడతానని అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. మరి ఈ ఓపెన్ ఆఫర్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news