Moviesఅటూ ఇటూ తిరిగి ప‌వ‌న్ ఆమెతోనే రొమాన్స్‌కు రెడీ అయ్యాడే ?

అటూ ఇటూ తిరిగి ప‌వ‌న్ ఆమెతోనే రొమాన్స్‌కు రెడీ అయ్యాడే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాతో ప్రేక్షుల ముందుకు వ‌చ్చిన ప‌వ‌న్ ఆ త‌ర‌వాత వ‌రుస పెట్టి క్రిష్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఆ వెంట‌నే సురేంద‌ర్ రెడ్డి సినిమా, హ‌రీష్ శంక‌ర్ సినిమాల‌తో పాటు మాల్లూవుడ్ సూప‌ర్ హిట్ మూవీ అయ్య‌ప్ప కోషియం రీమేక్‌లో కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన ఈ సినిమాకు రీమేక్‌గా తెలుగులో వ‌స్తోన్న ఈ సినిమాకు సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు.

దర్శకుడు సాగర్ చంద్ర ఒరిజినల్ వెర్షన్ ను మరింత బెటర్ చేస్తూ అనేక కీలక మార్పులు చేసిన‌ట్టు స‌మాచారం. మ‌ళ‌యాళంలో ఇద్ద‌రు స్టార్ హీరోల‌కు ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల‌నే పెట్టారు. అది సినిమాకు చాలా ప్ల‌స్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే క్ర‌మంలో ఇక్క‌డ కూడా ఇద్ద‌రు స్టార్ హీరోయిన్లు ఫిక్స్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌.

ప‌వ‌న్ ప‌క్క‌న ముందుగా నిత్యా మీన‌న్ పేరు వినిపించింది. త‌ర్వాత ఆమె సెట్ కాద‌నుకున్నార‌ట‌. చివ‌ర‌కు అటూ ఇటూ తిరిగి స‌మంత పేరును ఫైన‌లైజ్ చేసిన‌ట్టు తెలుస్తోంది. వీరిద్ద‌రు క‌లిసి గ‌తంలో అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. స‌మంత ఫిక్స్ అయితే మ‌రోసారి స‌మంత – ప‌వ‌న్ జోడీ తెర‌మీద క‌నువిందు చేసేందుకు రెడీ అయిన‌ట్టే ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news