Gossipsబిగ్‌బాస్‌ మేనేజ్మెంట్‌పై ఫైర్ అయినా ఎన్టీఆర్..?

బిగ్‌బాస్‌ మేనేజ్మెంట్‌పై ఫైర్ అయినా ఎన్టీఆర్..?

బిగ్ బాస్ షో అభిమానులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. టివి కార్యక్రమాలలో ఇటీవల అత్యంత ఆదరణ పొందిన షో ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగులో తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సీజన్ సూపర్ హిట్ అయింది. న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన రెండవ సీజన్ మొదటి సీజన్ అంత ఆకట్టుకోలేకపోయింది అనేది అందరి నోటా వినిపిస్తున్న మాట.

అయితే ప్రస్తుతం ఈ షో ముగిసింది కానీ దీనికి సంబంధించి అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో సీజన్‌లో రేటింగ్స్, క్రేజ్ కూడా పోగొట్టుకున్న బిగ్‌ బాస్‌కి మూడో సీజన్‌లో భారీ క్రేజ్ రావాలంటే ముగింపు ఎపిసోడ్‌కి ఎన్టీఆర్ వచ్చి ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని బిగ్ బాస్ మేనేజ్మెంట్ భావించింది. అదే విషయం ఎన్టీఆర్‌కి చెప్పి భారీ అమౌంట్ కూడా ఆఫర్ చేశారు. అయితే ఎన్టీఆర్ మాత్రం వాళ్ళపై సీరియస్ అయ్యాడని టాక్.

ఆ దెబ్బతో బిగ్ బాస్ మేనేజ్మెంట్‌ ఎన్టీఆర్‌కి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఇంతకీ ఏమైనది అంటే.. బిగ్ బాస్ రెండో సీజన్ ముగింపు సభకు రావాల్సిందిగా ఆ మేనేజ్మెంట్ కోరగానే… మా నాన్న చనిపోయిన బాధలో నేనుంటే ఇలా అడగాలని ఎలా అనిపించింది? మినిమం కామన్‌సెన్స్ లేదా అంటూ వాళ్ళపై విరుచుకుపడ్డాడేటా ఎన్టీఆర్. మీరు ప్రస్తుతం సినిమాలో యాక్ట్ చేస్తున్నారు కదా అని బిగ్ బాస్ మేనేజ్మెంట్ తిరిగి ప్రశ్నించడంతో అది వంద కోట్ల ప్రాజెక్ట్. నేను షూటింగ్‌కి వెళ్ళకపోతే నిర్మాత భారీగా నష్టపోతాడు. అయినా అది ముందుగా ఒప్పుకున్న ప్రాజెక్ట్ కాబట్టి తప్పక చేస్తున్నాను. కానీ కొత్తగా ఇప్పుడు డబ్బుల కోసం ఒక ప్రోగ్రాంకి ఒప్పుకుని కెమేరా ముందుకు వచ్చి ఎలా ఎంటర్టైన్ చేయగలననుకున్నారు. .నా ఎమోషన్స్ గురించి కనీసం ఆలోచించాలి కదా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసాడట ఎన్టీఆర్ అది సంగతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news