Gossipsకోల్ కతా లో కుప్పకూలిన ఫ్లై ఓవర్..భయాందోళనలో ప్రజలు..

కోల్ కతా లో కుప్పకూలిన ఫ్లై ఓవర్..భయాందోళనలో ప్రజలు..

ఈ రోజు 5 గంటల ప్రాంతం లో వెస్ట్ కోల్ కతా లోని మజార్ హాట్ ప్రాంతం లోని బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఫ్లై ఓవర్ కూలిపోవడంతో స్థానిక ప్రజలు కొంత మంది దానికింద చిక్కుకుపోయారని అక్కడి ప్రజలు తెలిపారు. ఇక ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 5 మంది చనిపోయారని స్థానిక మీడియా లో వార్తలు ప్రచురం అవుతున్నాయి. సుమారు 6 మంది ఈ ఘటన లో గాయపడ్డారని తాజా సమాచారం.
2
ఇప్పటికే ఘటన స్థలానికి పొలిసు సిబ్బంది, మరియు కేంద్ర రక్షణ బలగాలు చేరుకొని సహాయక చర్యలు మొదలు పెట్టారు. బ్రిడ్జి కూలిపోవడానికి ప్రధాన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఊహించని ఘటనతో ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు. ప్రమాదం లో గాయపడిన ప్రజలను చుట్టుపక్కలవారు ఆసుపత్రి కి తరలిస్తున్నారు. 3

1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news