Newsపవన్, మహేష్, తారక్ ఒకేసారి డేట్స్ ఇస్తే బాహుబలి నిర్మాత...

పవన్, మహేష్, తారక్ ఒకేసారి డేట్స్ ఇస్తే బాహుబలి నిర్మాత ఎవరితో చేస్తానన్నాడంటే…

టాలీవుడ్ సూపర్ స్టార్స్ పవన్, మహేష్, ఎన్.టి.ఆర్.. ఈ ముగ్గురు డేట్స్ ఇవ్వాలే కాని దర్శకుడు ఎలాంటి కథ అయినా.. నిర్మాత ఎన్ని డబ్బులైనా పెట్టేందుకు సిద్ధమవుతారు. అయితే ఈ ముగ్గురు ఒకేసారి డేట్స్ ఇస్తే వారిలో ఎవరితో సినిమా తీస్తారు.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నే బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డకు ఎదురైంది. రానా హోస్ట్ గా నిర్వహిస్తున్న నెంబర్ వాన్ యారి లో రానా శోభు మీదకు ఈ ప్రశ్న సందించాడు. ఇక బాహుబలి లాంటి దేశం మెచ్చిన సినిమా తీసిన ఆర్కా మీడియా అధినేతల్లో ఒకరైన శోభు యార్లగడ్డని ఈ ప్రశ్నకు సెకన్ కూడా ఆలోచించకుండా తారక్ అనేశాడు.

స్వతహాగా ఎన్.టి.ఆర్ అభిమాని అయిన శోభు ఒకేసారి మహేష్, పవన్ లాంటి స్టార్లు వచ్చినా సరే ముందు యంగ్ టైగర్ సినిమా తర్వాతే వారితో అని నిక్కచ్చిగా చెప్పేశాడు. బాహుబలి లాంటి సినిమా తీసిన శోభు ఎన్.టి.ఆర్ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం చూస్తుంటే త్వరలోనే ఆయన నిర్మాణంలో తారక్ సినిమా షురూ అయ్యేట్టే పరిస్థితులు కబడుతున్నాయి.

అభిరుచి గల నిర్మాతలుగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు సక్సెస్ ఫుల్ నిర్మాతలుగానే కాదు తెలుగు సినిమా స్థాయిని పెంచిన బాహుబలి నిర్మాతలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చుకున్నారు. వేదం నుండి బాహుబలి రెండు పార్టుల వరకు ప్రొడక్షన్ వాల్యూస్ ను పెంచుకుంటూ జాతీయ స్థాయిలో సినిమాలు తీసే సంస్థగా ఆర్కా మీడియా వర్క్స్ ను టాప్ రేంజ్ లో నిలబెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news