Newsఈ రోజే తారక్ ఆ మార్కుని దాటేశాడు... అభిమానులు పండగ చేసుకుంటున్నారు

ఈ రోజే తారక్ ఆ మార్కుని దాటేశాడు… అభిమానులు పండగ చేసుకుంటున్నారు

గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హవా మాములుగా లేదు. టెంపర్ సినిమా నుండి ఎన్టీఆర్ విజయాల బాట పట్టిన విషయం తెలిసిందే.. తన క్రేజ్ కూడా రోజు రోజు కి పెరుగుతూనే ఉంది. ఆ క్రేజ్ మూలంగానే స్టార్ మా టీవీ వాళ్ళు భారీ పారితోషికం ఇచ్చి మరీ బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కి యాంకర్ గా తీసుకున్నారు.

ఇక అసలు విషయానికొస్తే ట్విట్టర్ లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే తారక్ ఫాలోయర్స్ సంఖ్య ఈ రోజు తో 1 మిలియన్ కి చేరుకుంది. నిన్న రంజాన్ సందర్భంగా జై లవకుశ రిలీజ్ డేట్ ని ప్రకటించారు.. అదేవిధంగా బిగ్ బాస్ తెలుగు టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు ఎన్టీఆర్ ఫాలోయర్స్ సంఖ్య 1 మిలియన్ దాటింది. ఇలా వరుస రోజుల్లో ఎన్టీఆర్ ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వరుసగా అవార్డులు.. వరుస ప్రకటనలతో ఈ సంవత్సరం ఎన్టీఆర్ క్రేజ్ మరింతగా పెరిగిందనటంలో ఏమాత్రం సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news