Moviesఎన్టీఆర్ ఇంట్లో పార్టీ .. మిస్సయిన ఆ ఇద్దరు స్టార్స్.. ఇండస్ట్రీలో...

ఎన్టీఆర్ ఇంట్లో పార్టీ .. మిస్సయిన ఆ ఇద్దరు స్టార్స్.. ఇండస్ట్రీలో అంత పెద్ద గొడవలు జరుగుతున్నాయా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా టిల్లు స్క్వేర్. డిజే టిల్లు కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది . ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించింది . టూ బోల్డ్ గా హాట్ గా సెక్సీగా అదరగొట్టేసింది అని చెప్పాలి . ఈ సినిమా తర్వాత అనుపమ పరమేశ్వరన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు జనాలు .

కేవలం రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే 85 కోట్లు క్రాస్ చేసి ఇండస్ట్రీలో సంచలన రికార్డు నెలకొల్పింది . పక్కాగా చెప్పాలంటే స్టార్స్ కూడా కష్టమైన రికార్డ్స్ ను అవలీలగా దాటేసాడు సిద్దు జొన్నలగడ్డ .ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ట్ల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ సందర్భంగా మూవీ టీంకు బిగ్ పార్టీ ఇచ్చాడు తారక్. ఈ పార్టీలో హీరో సిద్దోజొన్నలగడ్డ నిర్మాత నాగ వంశీ సిద్దు జొన్నలగడ్డ జాన్ జిగిడి దోస్త్ విశ్వక్సేన్ పాల్గొన్నారు.

ఈ పార్టీలో ఎక్కడా కూడా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ .. డైరెక్టర్ రామ్ కనిపించలేదు. దీంతో గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్త నిజం అంటూ నమ్మేస్తున్నారు జనాలు .ఈ సినిమా షూట్ టైంలో అనుపమ పరమేశ్వరన్ కు నాగవంశీకు ఏదో క్లాషెస్ మొదలయ్యాయి అంటూ ప్రచారం జరిగింది. సినిమా ప్రమోషన్స్ కోసం అటూ ఇటూ కలిసి తిరిగారే తప్పిస్తే ఎక్కడా కూడా వీళ్లు పెద్దగా మింగిల్ అయిన సందర్భాలు లేవు. అలాగే సిద్దు జొన్నలగడ్డకు డైరెక్టర్కు మధ్య క్లాషెస్ వచ్చినట్లు వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పార్టీ ఇచ్చిన సరే అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ అటెండ్ కాకపోవడంతో కొత్త డౌట్లు మొదలయ్యాయి . నిజంగానే వాళ్ళ మధ్య అంత పెద్ద గొడవలు జరిగాయా..??? అన్న రేంజ్ లో చర్చించుకుంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news