Moviesకృష్ణవంశీ మనసు ఎంత మంచిదంటే.. ఒక్క పూట అన్నం పెట్టినందుకు ఏకంగా...

కృష్ణవంశీ మనసు ఎంత మంచిదంటే.. ఒక్క పూట అన్నం పెట్టినందుకు ఏకంగా ఆయనని హీరో చేసేసాడు..!!

కృష్ణవంశీ .. ఇప్పుడంటే ఈ పేరుకి పెద్దగా క్రేజీ లేదు . కానీ ఒకప్పుడు ఎలాంటి క్రేజ్ ఉండిందో మనకు తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు సినిమా ఇండస్ట్రీకి ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన స్టార్ డైరెక్టర్ . ఓ గులాబీ ..ఓ నిన్నే పెళ్ళాడుతా.. ఓ చంద్రలేఖ.. ఓ సింధూరం .. ఓ అంతపురం.. ఓ మురారి ..ఓ సముద్రం ..ఓ ఖడ్గం..ఓ రాఖీ.. చందమామ ..మహాత్మా అబ్బో ఒకటా రెండా..? చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో కృష్ణవంశీ ట్రాక్ రికార్డ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు .

అలాంటి కృష్ణవంశీ ఇప్పుడు హిట్లు లేక అల్లాడిపోతున్నాడు . నమ్మి ఏ స్టార్ హీరో అవకాశాలు ఇవ్వడం లేదు అయితే కృష్ణవంశీ మాత్రం ఏ మేర నిరుత్సాహ పడకుండా తన కష్టాన్ని తాను నమ్ముకుంటూ వస్తూ వచ్చాడు . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణవంశీ తనకు హెల్ప్ చేసిన వ్యక్తుల గురించి చర్చించారు . కృష్ణవంశీ చాలా కష్టపడి ఇండస్ట్రీ లోకి వచ్చాడు. పక్కాగా చెప్పాలంటే అన్నం కూడా తినని రోజులు ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయట పెట్టాడు.

ఆయన మాట్లాడుతూ ..”అప్పటికే నేను అన్నం తిని ఐదు రోజులు అయిపోతుంది .. ఫుల్ నీరసం.. కళ్ళు మూతలు పడిపోతున్నాయి ..అవకాశాలు ఎవ్వరు ఇవ్వడం లేదు.. పోనీ వెనక్కి వెళ్ళిపోదామా అంటే అహం అడ్డు వస్తుంది.. అంటే నేను ఓడిపోయినట్లేగా అన్న ఫీలింగ్ నాకు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటుంది.. అదే సమయంలో ఆ దేవుడిలా కనిపించాడు బ్రహ్మాజీ ..అన్నం తిందామా అని అడిగాడు.. నిజానికి ఎవరు అలా అడిగిన నో చెప్తాను.. కానీ ఆరోజు మాత్రం నో అని చెప్పలేకపోయాను ..ఆకలి నన్ను బలహీనుడిని చేసేసింది.. ఆరోజు బ్రహ్మాజీ పెట్టించిన ఫుడ్ తింటూ ఏం ఇస్తే ఇతగాడి రుణం తీర్చుకోగలను అనుకున్నాను ..ఆపై నేను దర్శకుడిగా సెటిల్ అయ్యాక ఆయనకు సింధూరం చిత్రంలో హీరోగా రోల్ ఇచ్చాను.. అతడు మంచి యాక్టర్ ..ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతాడు అని అనిపించింది ఆ చిత్రంతో బ్రహ్మాజీ కెరియర్ మలుపు తిరుగుతుంది అని భావించాను.. ఆ విధంగా నేను బ్రహ్మాజీకి రుణపడిపోయాను “అంటూ చెప్పుకొచ్చాడు . ప్రజెంట్ కృష్ణవంశీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news