Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ - గౌత‌మ్‌మీన‌న్ కాంబినేష‌న్లో మిస్ అయిన క్లాసిక్ సినిమా...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – గౌత‌మ్‌మీన‌న్ కాంబినేష‌న్లో మిస్ అయిన క్లాసిక్ సినిమా ఇదే…!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేరు.. పవన్ క్రేజ్ వేరు. ఒకప్పుడు పవన్ సినిమాలో తెరమీద కనిపిస్తే చాలు తెలుగు గడ్డ ఊగిపోయేది. పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించినా.. కొన్ని క్రేజీ సినిమాలు చేజేతులా వదులుకొని తప్పు చేశారు. పవన్ ఆ సినిమాలలో కూడా నటించి ఉంటే పవన్ కెరీర్ మరోలా ఉండేది. ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, గజిని, పోకిరి, అతడు, కిక్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు పవన్ మిస్ అయ్యాడు. ఈ క్రమంలోనే పవన్‌ ప్రముఖ త‌మిళ్‌ డైరెక్టర్ గౌతమ్ మీన‌న్‌ దర్శకత్వంలో ఓ క్రేజీ సినిమా మిస్ అయ్యాడు.

గౌతమ్ మీనన్ లవ్ స్టోరీస్, క్రైమ్ థ్రిల‌ర్ సినిమాలు చేయడంలో సిద్ధహస్తుడు. తెలుగు, తమిళంలో హీరోలకు ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ హిట్ సినిమాలు అందించాడు. అలాంటి డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా మిస్ అయ్యాడు. ఆ సినిమా మరేదో కాదు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అప్పట్లో జానీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు పవన్ దర్శకుడు. సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఇదే గీతా ఆర్ట్స్‌ లో పవన్ హీరోగా సత్యాగ్రహి సినిమా అనుకున్నారు.

ఈ సినిమాకు ముందుగా గౌతమ్ మీన‌న్ ద‌ర్శ‌కుడు. అనివార్య కారణాలవల్ల ఆయన సినిమా నుంచి తప్పుకోవలసి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా సత్యాగ్రహి సినిమాను తన దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారు. పెద్ద ఎత్తున ఓపెనింగ్ కార్యక్రమం.. ఫస్ట్ లుక్, పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాకముందే ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అల్లు అరవింద్‌కు.. పవన్ కు మధ్య‌ చాన్నాళ్లపాటు అంత సఖ్యత లేదు. అయితే 2008లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన జల్సా సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news