Moviesఓ మై గాడ్: పల్లవి ప్రశాంత్ ర్యాలీలో గొడవలు జరగడానికి కారణం...

ఓ మై గాడ్: పల్లవి ప్రశాంత్ ర్యాలీలో గొడవలు జరగడానికి కారణం వాళ్లే నా..? కనిపెట్టేసిన పోలీసులు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన అల్లర్ల విషయం ఏ విధంగా వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా బిగ్బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మరింత స్థాయిలో బిగ్ బాస్ పై సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వినిపించాయి . విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్ ర్యాలీలో చేసిన హంగామా కారణంగా ఫ్యాన్స్ తీసుకొచ్చిన నష్టం పోలీసులకు బాగా ఇబ్బంది కలిగించింది.

అందుకే సీపి సజ్జనార్ కథినంగా యాక్షన్ తీసుకున్నారు . అంతేకాదు అల్లరిలో కేసులో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను జైలుకు కూడా పంపించాడు . ఎట్టకేలకు బెయిల్ పై బయటకు వచ్చాడు . జూబ్లీహిల్స్ – అన్నపూర్ణ స్టూడియో వద్ద విధ్వాంశాని కి పాల్పడిన అభిమానులను ఒక్కొక్కరుగా కనిపెడుతూ పోలీస్ కేస్ ఫైల్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ అతని సోదరుడి పాటు 16 మందిని అరెస్ట్ చేశారు .

కాగా రీసెంట్గా బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే గొడవలు జరిగినట్లు కేసులు నమోదు చేశారు పోలీసులు. అంతేకాదు గవర్నమెంట్ ఆస్తుల ధ్వంసం కావడానికి పలువురు జనాలకు ఇబ్బంది కలిగించడానికి బిగ్బాస్ కారణమంటూ వాటిపై వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు జారీ చేసింది . ఈ విషయంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు కూడా నోటీసులు పంపించినట్లు తెలుస్తుంది . అంతేకాదు తన లాయర్లతో ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడట నాగార్జున . అయితే ఇకపై బిగ్ బాస్ షోను ముందుకు తీసుకెళ్లడానికి నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపించలేదట. ప్రతిసారి గొడవలు జరగడం వేరు ఈసారి గొడవలు జరగడం వేరు చాలా ఇబ్బంది పెట్టింది.. ఇకపై బిగ్ బాస్ సీజన్ ని ఆపేయాలి అంటూ డిసైడ్ అయిందట బిగ్ బాస్ మేనేజ్మెంట్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news