Newsముగ్గురిని ప్రేమించి.. ఒక‌రిని పెళ్లి చేసుకుని.. మ‌రొక‌రితో డేటింగ్.. ఆ క్రేజీ...

ముగ్గురిని ప్రేమించి.. ఒక‌రిని పెళ్లి చేసుకుని.. మ‌రొక‌రితో డేటింగ్.. ఆ క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

రూపా గంగూలీ.. ఒక‌ప్ప‌టి బెంగాలీ స్టార్‌ హీరోయిన్‌. టీవీలో వ‌చ్చిన‌ మహాభారత్ సంచ‌ల‌న‌ సీరియల్‌లో ద్రౌపదిగా నటించి దేశవ్యాప్త‌ ప్రేక్షకులకు చాలా దగ్గరైంది. సీరియల్స్‌ మాత్రమే కాకుండా షార్ట్‌ ఫిలింస్‌, సినిమాల్లోనూ నటించింది. హిందీ, ఇంగ్లీష్‌, ఇటాలియన్‌, బెంగాలీ, కన్నడ, మలయాళ, అస్సామీ భాషల్లో నటించింది. తెలుగులో శశిరేఖ శపథం, నా ఇల్లే నా స్వర్గం, ఇన్‌స్పెక్టర్‌ భవానీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఎంతోమంది గొప్పగొప్ప దర్శకులతో పని చేసిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

ముగ్గురిని ప్రేమించి.. ఒక‌రిని పెళ్లి చేసుకుని.. మ‌రొక‌రితో స‌హ‌జీవ‌నం చేసింది రూపా. 1992లో మెకానికల్‌ ఇంజనీర్‌ ద్రుభో ముఖర్జీని పెళ్లాడింది. దీనికి ముందు సినీరంగంలో ఉగ్గురిని ప్రేమించింది. అయితే.. వారితో ఆమెకు వివాహం కాలేదు. ఇక‌, ధ్రుభోతో వివాహం త‌ర్వాత ఆకాశ్ జన్మించాడు. కానీ తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రూపా బెంగాలీ సింగర్‌ దిబ్యేందు ముఖర్జీని ప్రేమించింది. వీరిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. కొన్నేళ్లపాటు సహజీవనం చేశారు. కానీ చివరకు ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

దీని గురించి రూపా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నేను చనిపోవాలనుకు న్నాను. మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాను. కొడుకు పుట్టకముందు ఓసారి వాడు పుట్టిన తర్వాత రెండుసార్లు చనిపోదామని ప్రయత్నించాను. కానీ ప్రతిసారీ బతికిపోయేదాన్ని. నన్ను నేను అంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నించాను. కానీ దేవుడు దాన్ని జరగనివ్వలేదు. వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను.

విడాకులు తీసుకుందామని ఎన్నోసార్లు అనుకునేదాన్ని, మళ్లీ చివరి నిమిషంలో ఆగిపోయేదాన్ని. విడా కులు కావాలనగానే అతడు సారీ చెప్పేవాడు. అలా మా మధ్య గొడవ చల్లారిపోయేది. కానీ 2002 సంవత్స రం నాటికి ఇంకా భరించడం నా వల్ల కాలేదు అని చెప్పుకొచ్చింది. అలా వీరు 2007లో అధికారికంగా విడిపోయారు. ప్ర‌స్తుతం ఒంట‌రిగానే రూపా జీవిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news