Newsడైరెక్టర్ కృష్ణవంశీ.. ఛార్మి విషయంలో ఇన్ని మాటలు ఎందుకు పడాల్సి వచ్చిందో...

డైరెక్టర్ కృష్ణవంశీ.. ఛార్మి విషయంలో ఇన్ని మాటలు ఎందుకు పడాల్సి వచ్చిందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి అందరికీ తెలిసిందే. కృష్ణవంశీ ఆర్జీవీ అసోసియేట్ అనే విషయం తెలిసిందే. కానీ, దర్శకుడిగా మాత్రం ఆయన ఫార్ములాను వాడలేదు కృష్ణవంశీ. గులాబి సినిమాతో దర్శకుడైన కృష్ణవంశీ నాగార్జున తో తీసిన నిన్నే పెళ్ళాడతా సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారాడు.

మురారి, ఖఢ్గం, అంతపురం, సింధూరం, చంద్రలేఖ, సముద్రం, శ్రీ ఆంజనేయం, రాఖీ, చక్రం, మహాత్మ..ఇలా మంచి కథా బలమున్న సినిమాలను తీశారు. కృష్ణవంశీ కెరీర్‌లో హిట్స్ ఉన్నట్టే ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. సినిమా మేకింగ్ విషయంలో చాలా మొండిఘటం. అనుకున్నదే చేస్తాడు. ఈ విషయంలో నిర్మాతతో కూడా చర్చలకి దిగుతాడు.

రాసుకున్న సీన్స్ పర్ఫెక్ట్‌గా వచ్చేవరకూ అసలు కాంప్రమైజ్ అవడు. అలాగే హీరోయిన్ విషయంలోనూ. ముఖ్యంగా ఛార్మి కి ఆయన సినిమాలలో ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల విమర్శలు కూడా ఎదుర్కున్నాడు. శ్రీ ఆంజనేయం సినిమాలో ఛార్మీ ఎక్స్‌ఫోజింగ్ చూసి తిట్టనివారు లేరు. భక్తి ప్రధానమైన సినిమాలో ఇలాంటి గ్లామర్ సీన్స్ ఏంటీ అని కామెంట్స్ చేశారు.

చక్రం సినిమాలో కూడా ఛార్మి అందాలు చూసి చమటలు కక్కుకున్న జనాలున్నారు. ఆ తర్వాత రాఖీ. ఈ సినిమాలో కూడా ఛార్మి ఒక హీరోయిన్‌గా నటించింది. కృష్ణవంశీ అలా మూడు సినిమాలలో ఛార్మికి ఛాన్స్ ఇవ్వడం పెద్ద కాంట్రవర్సీ అయింది. ఒక్క సినిమా ఫ్లాపైతేనే ఏ దర్శకుడు రెండవ సినిమా ఇవ్వడానికి ఆలోచిస్తాడు. అలాంటి రెండు ఫ్లాపైనా మళ్ళీ రాఖీలో ఛాన్స్ ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పుకున్నారు. అదే ఛార్మి ఇప్పుడు పూరి జగన్నాధ్ తో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news