News' భోళాశంక‌ర్‌ ' పై అవ‌న్నీ ఉత్త ఫేక్‌... అస్స‌లు న‌మ్మొద్దు..!

‘ భోళాశంక‌ర్‌ ‘ పై అవ‌న్నీ ఉత్త ఫేక్‌… అస్స‌లు న‌మ్మొద్దు..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా దర్శకుడు మెహర్ రమేష్ తెర‌కెక్కించిన లేటెస్ట్ కమర్షియల్ సినిమా భోళా శంకర్‌. అప్పుడెప్పుడో 7 – 8 సంవత్సరాల క్రితం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్గా భోళాశంకర్ తెరకెక్కింది. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి పాత్రలో నటించగా.. సుశాంత్ లాంటి యంగ్ హీరో కూడా ఈ సినిమాలో నటించారు. అసలే రీమేక్‌ సినిమా.. అందులోనూ ఎప్పుడో పదేళ్ల క్రితం మెగా ఫోన్ పట్టిన మెహర్ రమేష్ ఈ సినిమా డైరెక్టర్ కావడంతో ముందు నుంచి అంత అంచనాలు అయితే లేవు.

చివరకు సినిమా రిలీజ్ అయ్యాక కూడా సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో భోళాశంకర్ సినిమాపై చాలా రూమర్లు అటు చిరంజీవి విషయంలో.. ఇటు నిర్మాత అనిల్ సుంకర విషయంలో వినిపించాయి. సోషల్ మీడియాతో పాటు వెబ్ మీడియా.. యూట్యూబ్ ఛానల్స్ లో ఎక్కువగా నెగిటివ్ ప్రచారం జరిగింది. అటు చిరంజీవి ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారని.. ఇటు నిర్మాత ఆస్తులు తనఖా పెట్టారు అంటూ రకరకాల పుకార్లు గట్టిగా వినిపించాయి.

ఈ ప్రచారంపై నిర్మాత అనిల్ సుంకర క్లారిటీ ఇచ్చారు. భోళాశంకర్ విషయంలో నడుస్తున్నవి రూమర్లు అని.. అవ‌న్నీ ఫేక్ ప్రచారాలు అని అందులో ఒక శాతం కూడా నిజం లేదు.. అవన్నీ అబద్ధాలు నిరాధారమైన ఆరోపణలు అని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియా ఖాతా నుంచి అధికారిక‌ ప్రకటన వచ్చింది. ఆ వార్తలని ఎవరు నమ్మవద్దని కోరుకుంటున్నామని.. అలాగే దాంతోపాటు ఆ మ్యాటర్ గురించి అసలు డిస్కషన్ కూడా అవసరం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఇక అనిల్ సుంకర చిరంజీవి లాంటి మంచి మనిషి తో తాను మరో సినిమా తెరకెక్కిస్తానని మరో సూపర్ హిట్ సినిమా తీసి భోళాశంక‌ర్ పరాజయాన్ని మరిచిపోయేలా చేస్తానంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా భోళాశంకర్ డిజాస్టర్ తర్వాత ఆ సినిమా చుట్టూ వస్తున్న వార్తలకు ఎట్టకేలకు చెక్ పెట్టేలా ఏకే ఎంటర్టైన్మెంట్స్ క్లారిటీ ఇచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news