Newsనాగార్జున కెరీర్‌ ట‌ర్న్ చేసిన ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా.. ఇలా...

నాగార్జున కెరీర్‌ ట‌ర్న్ చేసిన ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా.. ఇలా మారిపోయిందేంటి..!

ఈమెను మీరు కూడా కచ్చితంగా గుర్తుపట్టలేరు. అప్పుడెప్పుడో 2002లో తెలుగులో తొలి సినిమా చేసింది. అది కూడా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో..! ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా. అయితే దురదృష్టం.. ఆమెకు అదృష్టం కలిసి రాలేదు. మరో సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ప్లాప్ అయింది. దీంతో తెలుగు దర్శక.. నిర్మాతలు ఆమెని పట్టించుకోలేదు. చాలా రోజుల తర్వాత ఓ తెలుగు మూవీలో గెస్ట్ రోల్ చేసింది.

అలాంటి హీరోయిన్ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. ఇంతకు పై ఫోటోలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టారా. ఆమె ఎవరో కాదు గ్రేసి సింగ్. ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంటుంది. అమీర్ ఖాన్ హీరోగా 2001లో వచ్చిన లగాన్ సినిమా దేశాన్ని ఎంతలా ఊపేసిందో చూసాం. ఆ సినిమా హీరోయిన్ గ్రేసీసింగ్. తెలుగులో దశరథ్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా సంతోషం సినిమాలో నటించింది.

ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈమె చిన్నప్పుడే భరతనాట్యం, ఒడిసి లాంటి క్లాసికల్ డ్యాన్సులు నేర్చుకుంది. 17 ఏళ్లకే ఓ సీరియల్ లో న‌టిగా కెరియర్ మొదలుపెట్టి 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చేసింది. లగాన్ తర్వాత ఆమె పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తర్వాత తెలుగులో సంతోషం సినిమా చేసింది. ఆ సినిమా హిట్ అయింది. మోహన్ బాబు – శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన తప్పుచేసి పప్పుకూడు సినిమా చేసిన ఆ సినిమా ప్లాప్ అయ్యింది.

తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయిన ఆమె 2010లో టాలీవుడ్ లో రామ రామ కృష్ణ – రాందేవ్ అనే సినిమాల్లో తళుక్కున‌ మెరిసింది. దురదృష్టవశాత్తు ఆమెకు మళ్ళీ అవకాశాలు రాలేదు. తర్వాత పంజాబీ – హిందీ సినిమాలలో నటించిన ఆమె సీరియల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. న‌టిగా మంచి పేరు తెచ్చుకున్న గ్రేసీ డ్యాన్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ముందు బ్రహ్మకుమారిస్ తరఫున అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. అందుకు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాల్ లో షేర్ చేసింది. అప్పట్లో అందంగా ఉన్న గ్రేసీ వయసు పెరిగే కొద్దీ చాలా మారిపోయింది. అసలు తెలుగు ప్రేక్షకులు చూస్తే ఎవరో గుర్తుపట్టనంతగా ఆమె ఫేస్ మారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news