Movies"వేదం సినిమాలో ఆ పాత్ర చేస్తే నీకు చచ్చినా పెళ్లే కాదు".....

“వేదం సినిమాలో ఆ పాత్ర చేస్తే నీకు చచ్చినా పెళ్లే కాదు”.. స్టార్ డైరెక్టర్ తల్లి చెప్పిందే జరిగిందిగా..!!

సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఎప్పుడు పాత రొటీన్ కధలని తిప్పితిప్పి కొడుతూ.. అక్కడక్కడ రొమాంటిక్ సీన్స్ యాడ్ చేస్తూ ..ఏదో లేనిపోని బూతు డైలాగ్స్ చెప్పేసి ..క్రేజీ క్రేజీ హిట్లను తమ ఖాతాలో వేసుకోవడం కాదు . ఐదేళ్లకి ఒక సినిమా తీసిన పర్ఫెక్ట్ గా మెసేజ్ ఓరియెంటెడ్ ..నేటి సమాజానికి అవసరమైన కథను తీస్తే ఆ డైరెక్టర్ ని నెత్తిన పెట్టుకుంటారు జనాలు . ప్రజెంట్ ఆ లిస్టులో టాప్ పొజిషన్లో ఉన్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న క్రిష్ జాగర్లమూడి.

ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలలో ఒక సినిమాల్లో తీసిన కథ మరో సినిమాలో లేకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే అందరూ మల్టీ టాలెంటెడ్ అంటూ ఉంటారు. అయితే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమా ఆయనకు ఎంతో ఎంతో ఇష్టమట . ఇవన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగానే తెరకెక్కాయి . ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా సరే ..అభిమానుల్ని తెగ ఆకట్టుకునింది . ఒక మనిషి లైఫ్ లో డబ్బు కోసం ఎలా కష్టపడతారు అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ .

అయితే ఈ సినిమాలో అనుష్క శెట్టి వేశ్య పాత్రలో కనిపిస్తుంది. ఆమె పక్కనే కర్పూరం క్యారెక్టర్ లో అనుష్క శెట్టి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ నటించారు . అయితే ఈ పాత్ర కోసం క్రిష్ ముందుగా అనుకున్న వ్యక్తి ఆయనే అట . ఎస్ ఈ పాత్ర రాసుకున్నప్పుడు.. ఈ పాత్ర నేను చేస్తే బాగుంటుంది అంటూ ఆశపడ్డారట . అదే విషయం వాళ్ళ అమ్మకి చెప్పగా.. అరిచిందట . ఇలాంటి పాత్రను నువ్వు చేస్తే నీకు పెళ్లి కాదు అంటూ మండిపడిందట . దీంతో అమ్మ మాట కాదనలేక ఆయన పాత్ర వదులుకున్నాడు. అప్పుడే అనుష్క శెట్టి మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ పాత్రి చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే క్రిష్ ఒకవేళ ఆ పాత్ర చేసి ఉంటే మాత్రం సినిమా రిజల్ట్ మరో లెవెల్ లో ఉండేది అన్నది మనందరికీ తెలిసిన విషయమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news