Moviesచిరు-చరణ్ బిగ్ మల్టీ స్టారర్ మూవీ వచ్చేస్తుందోచ్..పాన్ ఇండియా డైరెక్టర్ సడెన్...

చిరు-చరణ్ బిగ్ మల్టీ స్టారర్ మూవీ వచ్చేస్తుందోచ్..పాన్ ఇండియా డైరెక్టర్ సడెన్ అనౌన్స్మెంట్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తుంది . టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా మల్టీస్టారర్ సినిమాలు చేసి మరింత క్రేజ్ తీసుకొస్తున్నారు . ఇప్పటికే చాలామంది నటులు మల్టీ స్టారర్ సినిమాలో నటించి హ్యూజ్ పాపులారిటీ – పబ్లిసిటీ – కలెక్షన్స్ రాబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాంచరణ్-తారక్ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి ఏకంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును తీసుకొచ్చారు . కాగా ఇలాంటి క్రమంలోనే చిరంజీవి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న చిరకాల కోరికను ప్రశాంత్ నీల్ తీర్చేసినట్లు న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది.

రాంచరణ్ తో చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలి అన్నది మెగా అభిమానుల కోరిక . కేవలం మెగా అభిమానులే కాదు ఇండస్ట్రీలో ఉండే టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా చిరంజీవి రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై మెరిస్తే చూడాలి అంటూ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు . అయితే కాదు ఏ గెస్ట్ రోల్ గానో.. కెమియో రోల్ నోనో కాదు.. ఫుల్ లెంత్ స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటూ చెప్పుకొస్తున్నారు . అయితే ఆచార్య సినిమాలో వీళ్ళు స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ సినిమా డిజాస్టర్ అయింది.

అలా కాకుండా ఇద్దరు కాంబోలో వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులనే తిరగరాసే విధంగా ఉండాలి అంటూ కోరుకుంటున్నారు ఫ్యాన్స్ . ఈ క్రమంలోనే ఆ కోరిక నేను తీరుస్తాను అంటూ ప్రశాంత్ హామీ ఇచ్చాడట మెగాస్టార్ కి.. త్వరలోనే రామ్ చరణ్ -మెగాస్టార్ లతో బిగ్ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన మరి కొద్ది రోజుల్లోనే రాబోతుంది. అంతేకాదు ఇప్పటికే కధ వివరించగా ఆయన ఓకే చేసినట్లు కూడా తెలుస్తుంది . దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అల్ వర్క్ అంత పూర్తయిపోయిందని ..సలార్ 2 సినిమా కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తారని తెలుస్తుంది . అయితే ఎన్టీఆర్ 31 సినిమా మాత్రం ఆగిపోయినట్లే అంటున్నారు సినీ ప్రముఖులు ..సినీ విశ్లేషకులు . చూడాలి మరి దీనిపై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news