Moviesఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో సెన్షేష‌న‌ల్‌గా మారిన ఇద్ద‌రు టాప్ హీరోయిన్లు వీళ్లే…...

ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో సెన్షేష‌న‌ల్‌గా మారిన ఇద్ద‌రు టాప్ హీరోయిన్లు వీళ్లే… !

ఒక న‌టీమ‌ణి హీరోయిన్‌గా నిల‌దొక్కుకోవాల‌న్నా.. పేరురావాల‌న్నా.. ఇండ‌స్ట్రీ మొత్తం క్యూ క‌ట్టాల‌న్నా.. చాలా క‌ష్ట‌ప‌డాలి. క‌నీసం రెండు మూడు సినిమాలు న‌టిస్తే త‌ప్ప‌.. హీరోయిన్‌గా ముద్ర వేసుకోవ‌డం చాలా క‌ష్టం. కానీ, ఇద్ద‌రు హీరోయిన్లు మాత్రం న‌టించింది… కేవ‌లం ఒకే ఒక్క సినిమాలో. త‌ర్వాత‌.. వాళ్లు మ‌ళ్లీ న‌టించ‌లేదు. కార‌ణాలు ఏవైనాకూడా.. వారు త‌ర్వాత ఎక్క‌డా న‌టించ‌లేదు.

దీంతో వారేమీ ఫేడ్ అవుట్ అయ్యార‌ని అనుకుంటే పొర‌పాటే. వారు మంచి ఫాంలో ఉన్న హీరోయిన్ల క‌న్నా.. ఎక్కువ‌గా రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని నిర్మాత‌లు క్యూ క‌ట్టారు. కానీ, వారు మాత్రం త‌ర్వాత‌.. సినిమాల జోలికి పోలేదు. వారిద్ద‌రూ.. కూడా దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు కాశీనాథుని విశ్వ‌నాథ్ సినిమాల్లో అరంగేట్రం చేసిన వారే. ఆయ‌న చేతిలో తీర్చిదిద్దుకున్న హీరోయిన్లే. కానీ, ఆయ‌న తీసిన త‌ర్వాత‌.. సినిమాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చినా చేయ‌లేదు.

వారిలో ఒక‌రు.. స‌బిత. 1981లో విడుదలైన స‌ప్త‌ప‌ది సినిమాతో ఆమె అరంగేట్రం చేశారు. ఈమె క‌న్న‌డియ‌న్‌. నృత్యం ప్రధానాంశంగా వచ్చిన ఈ సినిమాలో ఆమె కీ రోల్ పోషించారు. అంతకుముందు విశ్వనాధ్ దర్శక త్వంలో వచ్చిన శంకరాభరణం త‌ర్వాత‌ ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. మొత్తం సినిమా అంతా హీరోయిన్ చుట్టూనే తిరుగుతుంది. చారెడేసి క‌ళ్ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్న స‌బిత‌.. సూప‌ర్ హైలెట్‌గా నిలిచారు. అయితే.. త‌ర్వాత ఆమె న‌టించ‌లేదు.

అలాగే.. చంద్ర‌మోహ‌న్ హీరోగా వ‌చ్చిన విశ్వ‌నాథ్ సినిమా.. శుభోద‌యం. ఈ సినిమాలో హీరోయిన్‌గా సుల‌క్ష‌ణను తీసుకున్నారు. ఈమె కూడా చెల‌రేగి న‌టించారు. ఆత్మాభిమానం ఉన్న పాత్ర‌లో ఆమె లీన‌మై న‌టించారు. ఆమెపాత్ర‌కు నంది అవార్డు కూడా ద‌క్కింది. కానీ.. త‌ర్వాత‌.. మాత్రం న‌టించ‌లేదు. డ‌బుల్ రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని చెప్పినా.. ఈ ఇద్ద‌రూ కూడా త‌ర్వాత న‌టించ‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news