Moviesమహేష్ బాబు SSMB 28 ఫస్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది… పోకిరి మైండ్...

మహేష్ బాబు SSMB 28 ఫస్ట్ గ్లింప్స్ వ‌చ్చేసింది… పోకిరి మైండ్ బ్లాక్ డైలాగ్ రిపీట్‌

పర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ SSMB 28. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ – మ‌హేష్‌బాబు కాంబినేష‌న్లో వ‌స్తోన్న ఈ సినిమాపై లెక్క‌కు మిక్కిలిగా అంచ‌నాలు ఉన్నాయి. వీరిద్ద‌రి కాంబోలో 2005లో అత‌డు, ఆ త‌ర్వాత 2010లో ఖ‌లేజా సినిమాలు వ‌చ్చాయి. అంటే 13 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి వీరిద్ద‌రి కాంబినేష‌న్ రిపీట్ అవుతోంది. ఇటు మ‌హేష్ వ‌రుస హిట్ల‌తో స్వింగ్‌లో ఉండ‌డం.. అటు త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పురంలో లాంటి రెండు సూప‌ర్ హిట్ల త‌ర్వాత తెర‌కెక్కిస్తుండ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయ‌గా… దానికి అదిరిపోయే రెస్సాన్స్ వ‌చ్చింది. ఇక మే 31న మ‌హేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్ గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ గ్లింప్స్ నుంచి అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది.

ఈ గ్లింప్స్ లెన్త్ 80 సెకండ్ల పాటు ఉండ‌నుంది. ఇందులో మ‌హేష్‌బాబు లుక్‌తో పాటు రెండు, మూడు యాక్ష‌న్ క‌ట్స్‌, పోకిరిలోని మైండ్ బ్లాక్ రేంజ్‌లో ఓ అదిరిపోయే డైలాగ్ కూడా రివీల్ చేస్తున్నార‌ట‌. ఈ గ్లింప్స్‌తోనే ఈ సినిమాపై ఉన్న హైప్ ఓ రేంజ్‌కు వెళ్లిపోతుంద‌ని మేక‌ర్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పోకిరిలోని ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవ్వుద్దో అన్న డైలాగ్ రేంజ్‌లో ఓ డైలాగ్ గ్లింప్స్‌లో ఉంటుంద‌న్న వార్త‌తో మ‌హేష్ అభిమానుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13న గ్రాండ్ గా థియేటర్ల‌లో రిలీజ్ చేయనున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news