Moviesనాగార్జునతో ఆ ఒక్క విష‌యంలో రాజీ ప‌డ‌లేకే మొద‌టి భార్య శ్రీల‌క్ష్మి...

నాగార్జునతో ఆ ఒక్క విష‌యంలో రాజీ ప‌డ‌లేకే మొద‌టి భార్య శ్రీల‌క్ష్మి విడాకులు ఇచ్చేసిందా…!

టాలీవుడ్ అందాల మన్మధుడు అక్కినేని నాగార్జున ముందుగా దివంగత లెజెండ్రీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఏకైక కుమార్తె శ్రీలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నాగచైతన్య పుట్టాక మనస్పర్ధలు వచ్చాయి. నాలుగేళ్ల పాటు కలహాల కాపురం నడిచింది. 1990లో శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చేసి.. ఆ తర్వాత హీరోయిన్ అమలను పెళ్లి చేసుకున్నారు. అమల – నాగార్జున దంపతుల కుమారుడు అఖిల్ అన్న విషయం తెలిసిందే.

ఇక శ్రీ లక్ష్మీ నాగార్జున ఎందుకు విడిపోయారు ? అన్నదానిపై చాలా చర్చలు అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో జరిగాయి. చిన్నచిన్న విషయాలకు కూడా ఎవరు రాజీ పడే వారు కాదట. అటు శ్రీలక్ష్మి రామానాయుడు కుమార్తె. కోట్లాది రూపాయల ఆస్తులు ఆమె సొంతం. ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా పెరిగింది. ప్రతి విషయంలోనూ తనది పై చేయిగా ఉండాలని ఆమె భావించేవారు అట.

ఇటు నాగార్జున ఏఎన్ఆర్ తనయుడు. పైగా అయిన సినీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న హీరో. అప్పటికే నాగర్జునకు మహిళల్లో బాగా ఫాలోయింగ్ ఉండేది. విచిత్రం ఏంటంటే అమెరికాలో సివిల్ ఇంజనీరింగ్ చేసిన నాగార్జున ఉద్యోగం వ్యాపారాలు వదులుకొని సినిమా రంగంలో రాణించాలని తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలన్న పట్టుదలతో ఇండియాకు తిరిగి వచ్చారు.

అయితే శ్రీలక్ష్మి ఆలోచన మరోలా ఉంది. తన భర్త సినిమాలలో ఉండటం ఆమెకు ఇష్టం లేదు. అమెరికా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవ్వాలని.. అక్కడ మంచి మంచి వ్యాపారాలు చేసుకోవాలని ఆమె కోరిక. తన భర్తను ఈ గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉంచాలని.. తన ప్రపంచంలోనే తన భర్త ఉండాలని ఆమె కోరుకుంది. ఈ విషయంలో ఇద్దరు ఎవరు వెనక్కి తగ్గలేదు. చివరికి అది విడాకులు తీసుకునే వరకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని ఎవరి జీవితాల్లో వారు సెటిల్ అయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news