Moviesబ్రేకింగ్‌: హాస్ప‌ట‌ల్లో సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ.. మెరుగైన వైద్యం కోసం చెన్నై...

బ్రేకింగ్‌: హాస్ప‌ట‌ల్లో సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ.. మెరుగైన వైద్యం కోసం చెన్నై నుంచి హైద‌రాబాద్‌కు

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ అటు సినిమాలలోనూ, ఇటు రాజకీయాల్లోనూ లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ. రాజకీయంగా రెండు మూడు పార్టీలు మారుతూ వ‌చ్చిన ఖుష్బూ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు. ఆమె తమిళనాడు బిజెపి మహిళా విభాగం అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఖుష్బూ కు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు పదవి కట్టబెట్టింది.

ఇక గత ఎన్నికలలో ఆమె బిజెపి నుంచి చెన్నై న‌గ‌రంలోని థౌజండ్ లైట్స్ పిల్లర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమా రంగంలోనూ బిజీగా ఉంటున్న ఖుష్బూ తాజాగా అస్వస్థత‌కు గురయ్యారు. ఆమె చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి మరి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, నీరసంతో ఖుష్బూ ఆసుపత్రి పాలు అయినట్టు సోషల్ మీడియాలో ఆమె స్వయంగా వెల్లడించారు.

ఈ మేరకు ఆమె ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటో కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫ్లూ చాలా చెడ్డది… ఇది నాపై తీవ్రమైన ప్రభావం చూపించింది.. అధికమైన జ్వరం, తీవ్రమైన వంటి నొప్పులు బలహీనతతో నేను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని.. అడెనో వైర‌స్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని.. అనారోగ్యానికి గురైనట్టు ఏమాత్రం లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సరైన వైద్యం తీసుకోవాలని సూచించింది.

వెంటనే అప్రమత్తమై మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని.. తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకు వచ్చింది. ఈ పోస్ట్ పై సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. కీర్తి సురేష్ – రాశీఖ‌న్నా – నిక్కీ గ‌ల్రానీ – శ్రియ – శ్రీదేవి విజయ్ కుమార్ లాంటి పలువురు తారలు, ఖుష్బూ అభిమానులు, నెటిజన్లు స్పందించారు. మీరు త్వరగా కోలుకోవాలని మేడం అంటూ ఆకాంక్షిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news