MoviesSamantha అప్పుడు సమంత.. ఇప్పుడు రాశీఖన్నా.. ఆ పని చేసే క్లిక్...

Samantha అప్పుడు సమంత.. ఇప్పుడు రాశీఖన్నా.. ఆ పని చేసే క్లిక్ అవుతున్నారా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సరిపోదు .. దానికి తగ్గ కృషి , పట్టుదల , హార్డ్ వర్క్ చేయాలి. అలాంటి ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ మందే ఉన్నారు అని చెప్పాలి . కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంతలో ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే సినిమాలు వద్దన్నా మొగుడికి విడాకులు ఇచ్చి మరి సినిమాలు చేస్తుంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. కాకపోతే రీసెంట్గా సమంత సినిమాల కోసం ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే .

స్టార్ ఇంటి కోడలుగా ఉన్నప్పుడే హద్దులు మీరి నటించిన సమంత.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి.. కంటెంట్ ఉన్న సినిమాల కోసం తెగ కష్టపడుతుంది . బాలీవుడ్ లో ఏకంగా ఆమె నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాకపోతే రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన రాశి ఖన్నా .

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు చలనచిత్రం పరిచయమైన రాశి కన్నా ..ఇప్పుడు బాలీవుడ్లో దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే అమ్మడు ఏకంగా ముంబైలో ప్లాట్ కూడా కొన్నట్టు తెలుస్తుంది. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో రాశీ కు బాలీవుడ్ లో ఆఫర్స్ ఎక్కువయ్యాయి ..ఇదే క్రమంలో ఆమె తాజాగా ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో నటించింది . విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్ తో కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం విడుదలై దుమ్ము లేపుతుంది .

ఈ క్రమంలోనే రాశిఖన్నా యాక్షన్ సీక్వెన్స్ లో మైండ్ బ్లోయింగ్ అయ్యేలా ఫైట్స్ చేసింది. దీనితో రాశి ఖన్నా కూడా బాలీవుడ్లో పాతుకు పోతుంది . సమంత వెబ్ సిరీస్ చేసి బాలీవుడ్ లో ఎలా నిలదొక్కుకుందో ..రాశీ కూడా అలాగే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ చేసి తన సత్తా చాటుతుంది . అయితే బాలీవుడ్ పై ఉన్న మోజుతో తెలుగును దూరం పెడుతున్నారు ఇద్దరు ముద్దుగుమ్మలు అంటు జనాలు మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news