Moviesఓ మై గాడ్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..ఎంత డేంజర్...

ఓ మై గాడ్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..ఎంత డేంజర్ అంటే !!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ ముద్దుగుమ్మలు అందరూ వరుసగా వింత వింత రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటివరకు కని విని ఎరుగని వింత వ్యాధులకు గురవుతూ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ తెచ్చుకున్న సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే . ఎవరూ ఊహించని విధంగా సమంత లాంటి స్టార్ హీరోయిన్ ఇంతటి భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది అని తెలిసేసరికి అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆ వ్యాధికి చికిత్స కోసం దక్షిణ కొరియా వెళ్లిన సమంత రీసెంట్ గాని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం ఇండియాకు తిరిగి వచ్చింది.

శాకుంతలం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా సమంత చాలా నిరసించిపోయి.. డల్ గా పూర్తి అనారోగ్యంగా కనిపించింది . కాగా ఇదే టైంలో మరో స్టార్ హీరోయిన్ కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది . గాయనిగా ఇండస్ట్రీకు పరిచయమైన మమతా మోహన్ దాస్ తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించి మంచి హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకుంది. చిరంజీవి, నాగార్జున , వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో జతకట్టిన మమతా మోహన్ దాస్..క్యాన్సర్ వ్యాధి ని విజయవంతంగా ఎదుర్కొంది .

కాగా ఇటీవల మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది . విటిలిగో అనే ఆటో యూనియన్ డిజాస్టర్ తో బాధపడుతున్నట్లు మమతా మోహన్ దాస్ ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది . “డియర్ సన్.. నీకంటే ముందు నీ కిరణాలు నాపై పడడానికి నేను ముందుగా నిద్రలేస్తున్నాను.. నీ శక్తినంత నాకు ఇవ్వు.. ఎప్పటికీ నేను నీకు రుణపడి ఉంటాను ” అంటూ రాసుకొచ్చింది. కాగా విటిలిగో అనే వ్యాధి మెయిన్ లక్షణం చర్మం రంగు కోల్పోవడం బొల్లి తరహా వ్యాధి అని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news