Moviesఅద్గది..వీళ్లిద్దరి మధ్య అసలు గొడవ అక్కడే మొదలైంది .. తెర వెనుక...

అద్గది..వీళ్లిద్దరి మధ్య అసలు గొడవ అక్కడే మొదలైంది .. తెర వెనుక ఇంత జరిగిందా..?

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . ఓవైపు పాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు నటించిన సినిమాలు దారుణాతి దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి . పుష్ప సినిమా తర్వాత రష్మిక మందన హిట్ కొట్టిందే లేదు . ఆ తర్వాత రిలీజ్ అయినఆడవాళ్లు మీకు జోహార్లు బిగ్ డిజాస్టర్ గా మారింది. హిందీలో ఆమె నటించిన గుడ్ బై సినిమా కూడా బొక్క బోర్లా పడింది . కాగా ప్రజెంట్ రష్మిక మందన ఆశలు అన్ని ఈనెల 20వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనున్న మిషన్ మజ్ను పైన పెట్టుకొని ఉంది .

ఈ సినిమాలో సిద్ధార్థ మల్హోత్రతో స్క్రీన్ షేర్ చేసుకున్న రష్మిక మందన్నా .. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో మెరిసింది . అయితే రష్మిక మందన ను బాలీవుడ్ తరిమి కొడుతుంది అంటూ బాలీవుడ్ క్రిటిక్ కేఅర్కె కామెంట్స్ చేశారు . అంతేకాదు రష్మిక బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండని మధ్యలోకి లాగుతూ “లైగర్ సినిమా ఎంతటి ఫ్లాప్ అయిందో ..అంతకంటే డబ్బులు రేంజ్ లో నిన్ను బాలీవుడ్ నుండి తరిమికొడతాం. గెట్ రెడీ.. కానీ నువ్వు భోజ్ పూరీ లో నటించమని సజీషన్ ఇస్తున్నాను.. ఎంకరేజ్ చేస్తున్నాను” అంటూ పోస్ట్ చేశాడు .

ఇదే కాదు గతంలో కూడా రష్మిక మందన్న పై కేఅర్కె ఘాటుగా స్పందించారు . ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీకి పనికిరాదని ..ఆమె ఫేస్ కట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇష్టపడని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోని రష్మిక మందన కేఆర్కే మధ్య ఉన్న పాత గొడవలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కె ఆర్ కె తో గతంలో ఓ పార్టీలో రష్మిక మందన రూడ్ గా బిహేవ్ చేసిందని ..అతగాడిని లెక్క చేయలేదని .. ప్క్కనే ఉన్నా పట్టించుకోకుండా పక్క హీరోలతో మాట్లాడిందని..ఆ కారణంగానే కె ఆర్ కె ..రష్మిక మందన ను టార్గెట్ చేసి ఆమె సినిమాలను డీగ్రేడ్ అయ్యే విధంగా కౌంటర్ ఇస్తున్నారని బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . ఏది ఏమైనా సరే కన్నడ ఇండస్ట్రీలో కాంతారా డైరెక్టర్ తోమొదలైన గొడవ ఇప్పటివరకు సర్ధుమనిగిందే లేదు.. మళ్లీ బాలీవుడ్ లోనూ అలాంటి నెగటివ్ టాక్ ని సంపాదించుకుంటే మాత్రం రష్మిక మందన కెరియర్ డేంజర్ లో పడినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news