Moviesస్థాయిని మరచిపోయిన మహేష్ బాబు..నవ్వాలో ఏడవాల్లో అర్ధం కాక నలిగిపోతున్న ఫ్యాన్స్..!?

స్థాయిని మరచిపోయిన మహేష్ బాబు..నవ్వాలో ఏడవాల్లో అర్ధం కాక నలిగిపోతున్న ఫ్యాన్స్..!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ..ఓ హ్యాండ్ సమ్ హీరో. యంగ్ హీరోలకి యంగ్ బ్రదర్ అనిపించేలా యంగ్ లుక్స్ లో అదరగొడుతున్నాడు. మహేష్ బాబు ఎవరైనా తెలియని వారు చూస్తే కాలేజి కుర్రాడు అని అనుకుంటారు . పెళ్లయిందని పెళ్లి కావాల్సిన కొడుకున్నాడని అంత పెద్ద కూతురు ఉందని ఎవరు అనుకోరు . ఆ అందానికి సీక్రెట్స్ ఆయనకే తెలియాలి.కాగా రీసెంట్ గా సర్కారీ వారి పాట సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు రెండు రోజుల క్రితమే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ చేస్తున్న మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఈ సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోషన్లు కూడా మొదలు పెట్టేసారు .తనదైన స్టైల్ లో సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు . కాగా ఇక్కడే మహేష్ బాబు తెలిసి చేశారో తెలియక చేశారు పప్పులో కాలేశారు. దీంతో అభిమానులు బాధపడిపోతున్నారు.

రీసెంట్ గా ఓ డ్యాన్ షోలో గెస్ట్ గా వచ్చిన మహేష్ బాబు చేసిన అల్లరి మనం చూసాం . ఆయన సందడి ఆయన హంగామా అంతా ఇంత కాదు. కూతురితో కలిసి నానా రచ్చ చేశాడు .అఫ్ కోర్స్ చూడటానికి చాలా చక్కగా అనిపించింది. అయితే రీసెంట్ గా మహేష్ బాబు సీరియల్ ప్రమోషన్ లో కనిపించారు . మహేష్ బాబు స్థాయిని మరిచిపోయి ఆయన ఫోటోని సీరియల్ ప్రమోషన్ కోసం వాడేసుకుంటున్నారు అంటూ సదురు ఛానల్ పై మండిపడుతున్నారు ఫ్యాన్స్.

త్వరలో ప్రముఖ ఛానల్లో ప్రారంభం కాబోయే “పడమటి సంధ్యారాగం” అనే సీరియల్ పోస్టర్ పై మహేష్ బాబు ఫోటోని వేశారు . దీంతో ఆయన అభిమానులు మండిపోతున్నారు. మహేష్ బాబు స్దాయి ఎక్కడ నీ సీరియల్ ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు ఫోటోని యాడ్ చేస్తావా.. ఫస్ట్ ఆ ఫోటో తీసేయ్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతానికి ఈ పోస్టర్ పై ఓ రేంజ్ లో నెట్టింట ట్రోలింగ్ జరుగుతుంది. ఇకనైనా మహేష్ బాబు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news