Moviesఆ హీరోయిన్ నాకు వద్దు అని ప్రభాస్ చెప్పినా..బలవంతంగా రొమాన్స్ చేయించిన...

ఆ హీరోయిన్ నాకు వద్దు అని ప్రభాస్ చెప్పినా..బలవంతంగా రొమాన్స్ చేయించిన డైరెక్టర్..రిజల్ట్ చూసి షాక్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు ఈశ్వర్ సినిమా చూసి ఇప్పుడు బాహుబలి సినిమా చూస్తే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి ఈశ్వర్ సినిమాలో ఉండే ఆ ప్రభాసేన ..బాహుబలి లో ఉండే అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ చేసిన ప్రభాస్.. అంటూ షాక్ అయిపోతారు. అంత డెవలప్ అయ్యారు ప్రభాస్. అంతేకాదు సినిమా సినిమాకి తన రేంజ్ మార్చుకుంటూ ఇప్పుడు దాదాపు ఒక్కో సినిమాకి 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోగా సినీ ఇండస్ట్రీలో సరి కొత్త సంచలన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇలాంటి ఘనత సాధించిన టాలీవుడ్ హీరో ఇతనే అనే చెప్పాలి.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న ప్రాజెక్టుస్ అన్ని పాన్ ఇండియా మూవీలే. రీసెంట్ గా మారుతి డైరెక్షన్లో ఓ సినిమాకు కమిట్ అయిన ప్రభాస్ ఆ సినిమాను కూడా మొదటిగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ సాహో, రాధే శ్యామ్ రిజల్ట్ చూశాక వద్దు తెలుగులోనే ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా భాషలో డబ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కాగా ప్రస్తుతం ఆది పురుష ప్రాజెక్టు కె సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉండగా.. సల్లర్ ప్రాజెక్టు కే షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ఇలాంటి తరుణంలో ప్రభాస్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే ప్రభాస్ కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి కానీ ఫ్లాప్ అయినా కానీ కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమా బిల్లా. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలామందికి నచ్చింది. కొంతమందికి అర్థం కాకపోయినా ఆయన ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోయి నటించడం సినీ ప్రముఖులకు కూడా తెగ నచ్చేసింది. దీంతో సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా నిర్మాతలను గట్టున పడేసింది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క, నమిత నటించారు.

అయితే మొదటిగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్కని ఒక్కటే అనుకున్నారట . కానీ ఆ తర్వాత ఇంకో హీరోయిన్ కూడా ఉంటే అనుష్క పాత్ర మరింత రీచ్ అవుతుందని చెప్పి నమిత అని ఫైనల్ చేశారట. అయితే మేకర్స్ కు ముందుగానే ప్రభాస్ నమిత హీరోయిన్ గా వద్దు. ఆమె నా పక్కన సెట్ అవ్వదు జనాలు యాక్సెప్ట్ చేయలేరు అని ప్రభాస్ చెప్పిన డైరెక్టర్ మెహర్ రమేష్ వినకుండా నమితని ఫైనల్ చేశారట .ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉన్నా కానీ తెరపై నమిత ప్రభాస్ జోడిని చూసి జనాలు నవ్వుకున్నారు. ఇదేంట్రా బాబు ఈ డైరెక్టర్ ఇలాంటి పని చేశారు అంటూ షాక్ అయ్యారు. నిజం చెప్పాలంటే సినిమాలో నమిత ప్రభాస్ కన్నా కూడా అనుష్క ప్రభాస్ సీన్స్ జనాలు ఎక్కువగా ఎంజాయ్ చేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news