Movies"నాకు సిగ్గేస్తుంది"..అనుపమ నుండి ఊహించని పోస్ట్..నెట్టింట వైరల్..!!

“నాకు సిగ్గేస్తుంది”..అనుపమ నుండి ఊహించని పోస్ట్..నెట్టింట వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో అందాలు ఆరబోసే నటిమణులు చాలా మందే ఉన్నా కానీ, ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడేసే హీరోయిన్స్ చాలా తక్కువ. ఫింగర్ మీద కౌంటింగ్ చేయచ్చు. ఏదో సాయి పల్లవి పుణ్యమా అంటూ..ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ ఉన్న విషయం డైరెక్ట్ గా ఇంటర్వ్యుల్లో చెప్పుకొస్తున్నారు కానీ..అంతకముందు ఏం అనిపించిన లోలోపలే దాచుకునే వారు. మొత్తానికి సాయి పల్లవి తనకు తెలియకుండానే కొందరి హీరోయిన్స్ ని మార్చేస్తుంది.

అయితే, ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ అనుపమ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎప్పుడు తన పని తాను చూసుకోనిపోయే అనుపమ..ఈసారి, సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కాంట్రవర్షీయల్ గా మారింది దీంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఓ చెత్త కుప్ప దగ్గర ఆవులు , కుక్కలు అక్కడే పడి ఉన్న చెత్తను తింటున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఓ నోట్ రాసుకొచ్చింది.

అనుపమ పోస్ట్ లో ఏముందంటే..”నా గుడ్ మార్నింగ్ ఎలా ఉందో చూడండి. ఆల్ మోస్ట్ రోజు ఇలానే మొదలవుతోంది. ఇప్పటికి ఈ భూమ్మీద ఇలాంటివి చేస్తూ(రోడ్ల పై చెత్త వేస్తూ) ప్రకృతిని నాశనం చేసే వాళ్ళను చూస్తుంటే నాకు సిగ్గుగా ఉంది..అంటూ #SaveEarth..#SavePlanet అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో అనుపమ ఓ పోస్ట్ వేసింది. ఇక దీనిపై నెటిజన్లు భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఏమో అవును మనుషుల్లో ఛేంజస్ రావాలి..అంటుంటే..మరికొందరు పని లేక ఇలాంటి పనిలేని పోస్ట్లు చేస్తున్నావా అంటూ మడిపడుతున్నారు. టోటల్ గా సగం టిట్లు సగం పొగడ్తలతో అనుపమ పోస్ట్ వైరల్ మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news