Movies# NTR 30 పై రెండు అదిరిపోయే అప్‌డేట్లు... తార‌క్ ఫ్యాన్స్...

# NTR 30 పై రెండు అదిరిపోయే అప్‌డేట్లు… తార‌క్ ఫ్యాన్స్ సంబ‌రాలే ఇక‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తాజాగా 500 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. యువ సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై కొర‌టాల స‌న్నిహితుడు మిక్కిలినేని సుధాక‌ర్ – నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఆచార్య త‌ర్వాత కొర‌టాల శివ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. ఆచార్య ఎఫెక్ట్‌తో కొర‌టాల చాలా జాగ్ర‌త్త‌ల‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. గ‌తంలో ఎన్టీఆర్ – కొర‌టాల శివ కాంబినేష‌న్లో జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా వ‌చ్చింది. ఆ సినిమా అప్ప‌ట్లో భారీ హిట్ అయ్యింది. దీంతో స‌హజంగానే తాజా సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది.

ఇటు త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యి రెండు నెల‌లు అవుతోంది. అటు ఆచార్య కూడా రిలీజ్ అయ్యింది. కొర‌టాల – ఎన్టీఆర్ ఇద్ద‌రు ఫ్రీగానే ఉన్నా.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ? కూడా తెలియ‌ట్లేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఈ సినిమా నుంచి రెండు సాలిడ్ అప్‌డేట్స్ బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది.

హీరోయిన్ ఎవ‌రు ? అన్న‌ది ఇంకా ఖ‌రారు చేయ‌క‌పోయినా పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న‌, కియారా అద్వానీ పేర్లు లైన్లో ఉన్నాయి. కొర‌టాల ఓటు ఎవ‌రికి ప‌డుతుందో ? ఇంకా స‌స్పెన్స్ నడుస్తోంది. ఇక మ‌రో అప్‌డేట్ ఏంటంటే ఈ సినిమాను వ‌చ్చే ఏప్రిల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయితే చాలు.. ఎన్టీఆర్ సినిమా గురించి కంటిన్యూగా అప్‌డేట్స్ స్టార్ట్ అవుతాయి.. అప్పుడు తార‌క్ ఫ్యాన్స్‌కు అంత‌కు మించిన సంబ‌రం ఉండ‌దు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news