Moviesఆచార్య క్లైమాక్స్‌..గుండెల్ని పిండేసే సీన్..!!

ఆచార్య క్లైమాక్స్‌..గుండెల్ని పిండేసే సీన్..!!

మెగా అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన మూమెంట్ మరి కొద్ది గంటల్లో రానుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన తాజా సినిమా ఆచార్య‌. స‌క్సెస్ ఫుల్ సినిమాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ సినిమాకు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఫ్యాన్స్ తో పాటు స్టార్ సెలబ్రిటీలు కూడా..తండ్రీ కొడుకులు ఇద్దరిని ఒక్కే స్క్రీన్ పై చూడాలి అని ఎప్పటినుండో అనుకుంటున్నారో. గ‌తంలో వీళ్లు మ‌గ‌ధీర‌, బ్రూస్ లీ సినిమాల్లో కనిపించారు.. కానీ ఆచార్య‌లో చిరు – చెర్రీ ఇద్ద‌రూ ఫుల్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కొణిదెల ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ్ మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించారు.

ఈ ప్రెస్టీజియస్ సినిమా లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. రెజినా ఐటెం సాంగ్ లో చిరుతో పోటీ గా చిందేసింది. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 29 అనగ మరి కొన్ని గంటల్లో గ్రాండ్ గా ధియేటర్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట యమ హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు ఈ సినిమాలో సిద్ధ పాత్ర గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు లీకైన మ్యటర్ వింటే..కళ్లల్లో నీళ్లు రావడం పక్క అంటున్నారు సినీ మేకర్స్.

ఆచార్య సినిమాలో చరణ్ రోల్ చిన్నదే అయినా.. కధకు మూలం ఆయనే అని ..ముఖ్యంగా సినిమాలో చరణ్ ఉన్నంత సేపు చిరు చెప్పే డైలాగ్స్ సూపర్ గా ఉంటాయని..ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సీన్ ఎవ్వరు ఊహించలేరు అని.. అంత బాగా కొరటాల డిజైన్ చేసాడని అంటున్నారు. ఆచార్య టీజ‌ర్లో రెడ్ క‌ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు శూలంతో రౌడీల్ని చీల్చి చెండాడే ఒక సీన్ ఉంటుంది..గమనించారా అదే ఈ సినిమా కి క్లైమాక్స్ షాట్ అంట.

సినిమాకి సూపర్ హైలైట్ అయ్యే సీన్ అదేనట. ఆ టైంలో చరణ్ చిరు తో చెప్పే మాటలు ప్రతి అభిమాని గుండెల్ని పిండేస్తాయని..ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారని మేకర్స్ అంటున్నారు. తండ్రీకొడుకుల యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని, అభిమానులను ఆకట్టుకునేలా సినిమా ఆద్యంతం ఉంటుందని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news